iDreamPost

భర్తకు దూరంగా ఉంటూ.. ఆ పనికి ఒప్పుకోలేదని ప్రియుడి మర్మాంగం కోసిన మహిళ

భర్తకు దూరంగా ఉంటూ.. ఆ పనికి ఒప్పుకోలేదని ప్రియుడి మర్మాంగం కోసిన మహిళ

ఈ మధ్య ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు సొసైటీలో చాలానే చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు పెళ్లైన తర్వాత కూడా అక్రమసంబంధాలతో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఒకానొక సందర్భంలో చంపడానికి కూడా వెనకాడటం లేదు. అయితే ఈ దారుణాలకు పాల్పడుతున్నది అబ్బాయిలే మాత్రం కాదండోయ్ అమ్మాయిలు సైతం కౄరంగా ఆలోచిస్తున్నారు. ప్రియుడు దక్కలేదని, పెళ్లికి ఒప్పుకోలేదనే కారణాలతో ప్రియురాలు పక్కా ప్లాన్ తో దాడులకు పాల్పడి ప్రాణాలు తీస్తున్నారు. ఇదే రీతిలో ఓ మహిళ ఇదివరకే పెళ్లై భర్తకు దూరంగా ఉంటూ.. ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుని అతడు ఆ పనికి ఒప్పుకోలేదని షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఏం చేసిందంటే..

జార్ఖండ్‌ లోని గిరిదిహ్ జిల్లా తారాతండ్ గ్రామానికి చెందిన ఓ మహిళకు ఇదివరకే పెళ్లైంది. ఏవో కారణాలతో కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఆ మహిళ అదే గ్రామానికి చెందిన పెళ్ళైనటువంటి యువకుడు సుశీల్ తుడుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇలా కొంతకాలం కొనసాగిన తర్వాత ఆమె అతడిని పెళ్లి చేసుకోమని బలవంతం చేసింది. కానీ సుశీల్ పెళ్లి ప్రస్తావనను నిరాకరించాడు.

దీంతో రగిలిపోయిన ఆ మహిళ సుశీల్ ను ప్రైవేట్‌గా కలవాలంటూ పిలిచింది. ప్రియురాలు పిలవడంతో వెళ్లిన సుశీల్ ఆమెతో సరసాలు మొదలు పెట్టాడు. అయితే అప్పటికే పక్కా ప్లాన్‌తో సిద్ధంగా ఉన్న మహిళ చేతిలో బ్లేడ్ తీసుకుని అతని మర్మాంగాన్ని కట్ చేసింది. ఈ దాడిలో అతను అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ తర్వాత సుశీల్ చనిపోయాడని భావించిన మహిళ నేరుగా తారాతాండ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి