iDreamPost

ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. కానీ చివరకు.. అసలేం జరిగిందంటే?

వాళ్లిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ ఇంతలోనే ఏమైందో తెలియదు గానీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే?

వాళ్లిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ ఇంతలోనే ఏమైందో తెలియదు గానీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే?

ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. కానీ చివరకు.. అసలేం జరిగిందంటే?

ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేము. ప్రేమ కోసం.. ప్రేమించిన వారి కోసం ఎంతో తాపత్రయ పడుతుంటారు. ప్రేమించిన వారిని దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు నేటి ప్రేమికులు. ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని ఎన్నో కలలుకంటుంటారు. కానీ ఒక వేళ ప్రేమ విఫలమైతే చావడానికి లేదా చంపడానికి కూడా ఆలోచించడం లేదు. ఇదే రీతిలో యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. స్కూళ్లో చదివే రోజుల నుంచే వారిద్దరిలో ప్రేమ చిగురించింది. కానీ చివరకు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ప్రేమికులిద్దరు రైలు కింద పడి తనువు చాలించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.

ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడడం, దాడులు చేయడం వంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. కానీ వాళ్లిద్దరి ప్రేమకు ఏం అడ్డుతగిలిందో తెలియదు కానీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లారు. ఈ ఘటన ఆదోని రైల్వే పోలీసుస్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై గోపాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రాలయానికి చెందిన టీస్టాల్‌ నిర్వాహకుడు ఆంజనేయులు, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె మేకల నందిని(20) కర్నూలులో బీటెక్‌ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఉగాది పండగ ఉండడంతో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకునేందుకు రెండు రోజుల కిందట సొంత ఊరుకు వచ్చారు. అయితే మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన చిన్నగోవిందు కుమారుడు చిన్నవెంకటేశులు(22) ఇంటర్మీడియట్‌ వరకు చదువుకుని వ్యవసాయం పనులు చేసుకుంటున్నారు.

కాగా చిన్నవెంకటేశు, నందినిలు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో గానీ నందిని ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇంట్లో కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. చివరకు మంత్రాలయం-మటుమర్రి రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి ప్రేమికులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కాగా వీరు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి