iDreamPost

భార్యకు భయపడ్డ మంచు మనోజ్.. ఆళ్లగడ్డ నుండి బాంబులు పడతాయంటూ

మంచు వారబ్బాయి మనోజ్ ఇటీవల ఈ ఏడాది వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు. మార్చి నెలలో రెండో సారి పెళ్లిపీటలు ఎక్కిన మనోడు.. మొన్న ముఖేష్ అంబానీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని.. సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు. ఇప్పుడు ఓ షోలో పాల్గొని సందడి చేశాడు.

మంచు వారబ్బాయి మనోజ్ ఇటీవల ఈ ఏడాది వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు. మార్చి నెలలో రెండో సారి పెళ్లిపీటలు ఎక్కిన మనోడు.. మొన్న ముఖేష్ అంబానీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని.. సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు. ఇప్పుడు ఓ షోలో పాల్గొని సందడి చేశాడు.

భార్యకు భయపడ్డ మంచు మనోజ్.. ఆళ్లగడ్డ నుండి బాంబులు పడతాయంటూ

తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ ఒకరు. మోహన్ బాబు నుండి నటనా వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు ఆయన పిల్లలు మంచు లక్ష్మీ, విష్ణు, మనోజ్. మార్చి నెలలో రెండో సారి పెళ్లి పీటలు ఎక్కి వార్తల్లో నిలిచిన మనోజ్.. కెరీర్‌పై కూడా దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న వాట్ ది ఫిష్ సినిమా షూటింగ్ దశలో ఉంది. అంతేకాదూ.. మొన్న దేశ దిగ్గజ వ్యాపార వేత్త, అపర కుబేరుడు ముఖేష్ అంబానీని కలిసి సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు. ముంబయిలో జియో వరల్డ్ ప్లాజా లాంచ్ ఈవెంట్‌కు టాలీవుడ్ నుండి మంచు మనోజ్ దంపతులు హాజరయ్యారు. అంతేకాకుండా బుల్లితెరపై హోస్ట్ అవతారం కూడా ఎత్తాడు.

ప్రముఖ ఛానల్ ఈటీవీలో ఓ గేమ్ షోతో సరికొత్తగా రాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు మనోజ్. ఇదిలా ఉంటే దీపావళి సందర్భంగా ఈటీవీ ఓ షో చేస్తుంది. మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు పేరుతో నిర్వహిస్తున్న ఆ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చాడు మంచు వారబ్బాయి. మంచి జోష్‌గా కనిపించిన కుర్రాడు ఆదిని మించినపోయిన సెటైర్స్ వేసి రచ్చ రచ్చ చేశాడు. తన హోస్ట్ చేయబోతున్న షో గురించి శ్రీముఖి తనదైన స్టైల్లో ప్రశ్నించగా.. ‘నీ ప్రొనౌన్స్ సరిగా లేదు’అంటూ ఆడుకున్నాడు. ఎక్కడ అని శ్రీముఖి.. ఆ ఈకి, టీకి మధ్యలో అంటూ నవ్వుకున్నారు. ఎలా అడిగితే చెబుతారు అనగా.. దగ్గరకి వస్తే చెబుతా అనగానే శ్రీముఖి మంచు మనోజ్ దగ్గరకి జరిగింది. అంతలో ఓ పాట వేసుకోగానే వెంటనే రియాక్ట్ అయ్యాడు.

 వద్దు వద్దు ఆళ్లగడ్డ నుండి బాంబులు పడిపోతాయంటూ.. అనగానే సుమ, శ్రీముఖి, అక్కడ ఉన్నవారంత ఫక్కున నవ్వారు. ఎందుకంటే మంచు మనోజ్ భార్య భూమా మౌనికా రెడ్డి స్వస్థలం ఆళ్లగడ్డ అన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది ఈటీవీ. ఇందులో మరికొన్ని ఫన్నీ కామెంట్లు చేసి.. నవ్వులు పువ్వులు పూయించారు మంచు మనోజ్. ఈ కార్యక్రమం దీపావళి సందర్భంగా ప్రసారం కానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి