iDreamPost

బెంగాల్లో జగన్ పథకాన్ని అమలు చేస్తామంటున్న మమత

బెంగాల్లో జగన్ పథకాన్ని అమలు చేస్తామంటున్న మమత

సమర్థవంతమైన పరిపాలనతో ప్రజలకు మంచి చేసేందుకు పరిపాలనా అనుభవం అవసరం లేదని 21 నెలల పాలనలోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిరూపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వైఎస్‌ జగన్‌ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు, పరిపాలనా పరంగా తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలు ప్రజలకు అత్యున్నత స్థాయిలో మేలు చేశాయి. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి. ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా, సరళతరంగా అందుతున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు, పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులు మెరుగయ్యాయి. అందుకే గడచిన స్థానిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైఎస్‌జగన్‌ పార్టీకి బ్రహ్మరథం పట్టారు.

వైఎస్‌ జగన్‌ పాలనను, ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నిశితంగా గమనిస్తున్న దేశంలోని ఇతర రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహా పథకాలను ప్రవేశపెట్టేందుకు యత్నిస్తున్నాయి. ఏపీలో అమలు చేస్తున్న వలంటీర్‌ తరహా వ్యవస్థను ఢిల్లీలోనూ, ఒడిశాలోనూ ప్రవేశపెట్టేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్, నవీన్‌ పట్నాయక్‌లు పరిశీలిస్తున్నారు.

తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆయా రాష్ట్రాలలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలలో కొన్ని ఏపీలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలే కావడం విశేషం. జిల్లా ప్రాతిపదికగా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని తమిళనాడులో డీఎంకే పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీని ఆ పార్టీ అధినేత స్టాలిన్‌ పొందుపరిచారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో సీఎం మమతా బెనర్జీ ఇచ్చిన హామీతో అందరి చూపు ఏపీవైపు మళ్లింది. మళ్లీ అధికారంలోకి వస్తే రేషన్‌ డోర్‌ డెలివరీ విధానం ద్వారా చౌకదుకాణ సరుకులు అందిస్తామని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు.

Also Read : జగన్ సోషల్ ఇంజినీరింగ్ తెచ్చిన విజయం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి