iDreamPost

భార్యకు దూరంగా జరిగి కాల్ గర్ల్స్ కు దగ్గరయ్యాడు. కానీ, వాళ్లే చివరికి కాటికి పంపారు

భార్యకు దూరంగా జరిగి కాల్ గర్ల్స్ కు దగ్గరయ్యాడు. కానీ, వాళ్లే చివరికి కాటికి పంపారు

పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు దీపక్, వయసు 42 ఏళ్లు. గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలం పాటు భార్యతో బాగానే సంసారం చేశాడు. కానీ, కొంత కాలానికి భార్యాభర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో భర్త భార్యతో చాలా సార్లు గొడవ పడ్డాడు. ఇక భర్తతో ఉండలేని ఆ మహిళ.. అతనికి గుడ్ బై చెప్పి పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే దీపిక్ రోజూ కార్ల్ గర్ల్స్ ను ఇంటికి తెచ్చుకుని ఎంజాయ్ చేసేవాడు. కట్ చేస్తే.. అదే కాల్ గర్ల్స్ చివరికి అతడిని ప్రాణాలతో లేకుండా చేశారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర ఉల్హాస్ నగర్ పరిధిలోని ఓ ప్రాంతం. ఇక్కడే దీపక్ (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ భార్యాభర్తలు సంతోషంగానే గడిపారు. కానీ, రాను రాను ఇతగాడు భార్యతో తరుచు గొడవ పడేవాడు. ఇక దీపక్ తో ఉండలేని అతని భార్య మూడేళ్ల కిందట భర్తకు గుడ్ బై చెప్పి పుట్టింటికి వెళ్లింది. దీంతో అప్పటి నుంచి దీపక్ కాల్ గర్ల్స్ ను ఏకంగా ఇంటికి తెచ్చుకుని ఎంజాయ్ చేస్తుండేవాడు. అయితే, తరుచు ఇతని వద్దకు శివాని అనే ఓ కాల్ గర్ల్ వస్తుండేది. ఇతని వద్ద డబ్బు బాగా ఉండడంతో ఎలాగైనా దోచుకోవాలని ప్లాన్ గీసింది. ఈ క్రమంలోనే దీపక్ శివానితో గొడవ పడ్డాడు.

ఇక శివాని కోపం మరింత పెరిగింది. ఇక పక్కా స్కెచ్ తోనే జూన్ 30 2023న శివాని దీపక్ ఇంటికి వెళ్లింది. అతనితో సన్నిహితంగా ఉన్నట్లు నటించింది. దీంతో మెల్లగా ప్రియుడికి ఫోన్ చేసి దీపక్ ఇంటికి రమ్మని కబురు పంపింది. ఇక అతడు రాగానే శివాని ప్రియుడితో చేతులు కలిపి దీపిక్ ను గొడ్డలితో నరికి హత్య చేశారు. అనంతరం అతని వద్ద ఉన్న డబ్బంత దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఇక మరుసటి రోజు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్: కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి