iDreamPost

హైదరాబాద్: కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య!

హైదరాబాద్: కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య!

హైదరాబాద్ లోని మాదాపూర్ లో విషాదం ఘటన చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం ఓ యువతి కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్నేహితులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువతిని రక్షించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే పోలీసులు అప్రమత్తమై సహాయక బృందాల సాయంతో ఆ అమ్మాయిని రక్షించే ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో ఆ యువతి అప్పటికే చనిపోయినట్లుగా పోలీసులు నిర్ధారించారు.

కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన పాయల్ అనే యువతి ఉద్యోగం నిమిత్తం 4 నెలల క్రితం హైదరబాద్ కు వచ్చింది. ఇన్ని రోజులు తన స్నేహితులతో పాటు నగరంలోని ఓ ప్రాంతంలో ఉండేది. అయితే, ఆ యువతి ప్రేమ విఫలమైటనట్లు తెలుస్తుంది. దీంతో అప్పటి నుంచి ఆ యువతి తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. గురువారం సాయంత్రం పాయల్ తన స్నేహితులతో కలిసి మాతీపూర్ లో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఈ క్రమంలోనే ఆ యువతి అదే బ్రిడ్జ్ నుంచి ఉన్న చెరువులో దూకింది. దీంతో వెంటనే స్పందించిన ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక బృందాలతో ఆ యువతిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో ఆ యువతి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆ యువతి మృతదేహాం కోసం గాలిస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: రెచ్చిపోయిన లోన్ యాప్ ఏజెంట్లు.. విద్యార్థి ఆత్మహత్య!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి