iDreamPost

దారుణం: స్కూల్ విద్యార్థినిల బాత్ రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టిన ప్రిన్సిపాల్!

దారుణం: స్కూల్ విద్యార్థినిల బాత్ రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టిన ప్రిన్సిపాల్!

ఈ మధ్యకాలంలో కొందరు గురువులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించాల్సింది పోయి వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ చివరికి అత్యాచారాలకు కూడా పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా అభం, శుభం తెలియని స్కూల్ విద్యార్థినిలపై కన్నేసి వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. ఈ ఘటనలు మరువక ముందే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ స్కూల్ ప్రిన్సిపాల్ ఏకంగా బాలికల బాత్ రూమ్ లో సీసీ కెమెరాలను అమార్చాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ పూణేలోని అంబి ప్రాంతంలో అలెగ్జాండర్ అనే వ్యక్తి ఓ స్కూల్ ను నడిపిస్తున్నాడు. ఈ పాఠశాలలో ఎంతో మంది పిల్లలు చదువుకుంటున్నారు. అయితే, పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించి తీర్చుదిద్దాల్సిన ఆ ప్రిన్పిపాల్.. ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా బాలికల బాత్ రూమ్ లో సీసీ కెమెరాలను పెట్టాడు. ఆ సీసీ కెమెరాలను గమనించిన కొందరు విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు.

ఆ పిల్లల తల్లిదండ్రులు మంగళవారం స్కూల్ కు వచ్చి పిల్లల బాత్ రూమ్ లో చూడగా సీసీ కెమెరాలు దర్శనమిచ్చాయి. వాటిని చూసి వాళ్లు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే స్కూల్ ప్రిన్సిపాల్ అయిన అలెగ్జాండర్ ను నిలదీశారు. దీంతో అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక నోట్లో నీళ్లు నమిలాడు. ఇక కోపంతో ఊగిపోయిన కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ పై దాడి చేసి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి