iDreamPost
android-app
ios-app

తల్లిని మందలించిన తండ్రి.. మనస్తాపంతో కుమార్తె..!

తల్లిని మందలించిన తండ్రి.. మనస్తాపంతో కుమార్తె..!

ఉన్నత చదువులు పూర్తి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కనింది. ఇందులో భాగంగా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. ఇక అప్పటి నుంచి ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే శ్రావణి ఇలా చేయడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు షాక్ గురవుతున్నారు. కట్ చేస్తే.. మంచిగా స్థిర పడుతుందనుకున్న తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు జల్లింది ఈ యువతి. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో అంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంతకు ఈ అమ్మాయి చేసిన పనేంటి? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాలోని నారాయణపురంలో నర్సింహా-కవిత భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి శ్రావణి (21) అనే కూతురు ఉంది. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన ఈ యువతి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఇంటి వద్దే ఉంటుంది. ఇదిలా ఉంటే.. తల్లి కవిత గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతుంది. ఇటీవల ఆ నొప్పి మరింత పెరగడంతో భర్త నర్సింహా ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే  నర్సింహా భార్యను మందలించినట్లు తెలుస్తోంది. దీంతో కూతురు శ్రావణి తీవ్ర మనస్థాపానికి గురై ఇటీవల ఇంటి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఆమె కుటుంబ సభ్యులు గమనించి వెంటనే కిందకు దించారు. ఇక కొన ప్రాణాలతో ఉండడంతో శ్రావణిని స్థానిక ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, మార్గమధ్యలోనే ఈ యువతి ప్రాణాలు కోల్పోవడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. అనంతరం ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. తండ్రి తల్లిని మందలించడంతో ఆత్మహత్య చేసుకున్న కూతురు నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: చిన్న కూతురని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.. చివరికి ఇలా చేయడంతో..!

marsbahis girişgamdom girişjojobet girişjojobet girişsiteye gitJojobet GirişJojobet