iDreamPost

భర్తను వదిలేసి ప్రియుడితో ఎఫైర్! మూడేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటూ..!

భర్తను వదిలేసి ప్రియుడితో ఎఫైర్! మూడేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటూ..!

ఆమెకు ఇంతకు ముందే ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజుల పాటు ఆ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కానీ, రాను రాను భర్తతో ఆమెకు మనస్పర్థలు వచ్చాయి. దీంతో భర్తకు గుడ్ బై చెప్పింది. అలా కొన్ని రోజుల తర్వాత ఈ మహిళ భార్యను వదిలేసిన వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు అప్పటి నుంచి కలిసి మెలిసి ఉండేవాళ్లు. అలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. ఏకంగా మూడేళ్ల పాటు కలిసున్నారు. కట్ చేస్తే.. ఇటీవల ఓ రోజు రాత్రి జరిగిన ఘటనతో ఈ మహిళ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం టౌన్ వానచర్ల ప్రాంతం. ఇక్కడే మల్లేశ్వరి (24) అనే మహిళ నివాసం ఉండేది. ఆమెకు గతంలో ఓ వ్యక్తితో పెళ్లైంది. మనస్పర్థల కారణంగా భర్తను వదిలేసింది. ఇకపోతే.. ఇదే ప్రాంతానికి చెందిన భార్యను వదిలేసిన నాగబాబుతో మల్లేశ్వరి పరిచయం పెంచుకుంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వీళ్లిద్దరూ దాదాపు మూడేళ్ల నుంచి ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేయడం మొదలు పెట్టారు. ఇన్నేళ్ల కాలంలో వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. ఇదిలా ఉంటే.. మల్లేశ్వరి ఉపాధి నిమిత్తం గత మూడు నెలల కిందట హైదరాబాద్ కు వచ్చింది. ఇక్కడే ఓ కంపెనీలో పని చేస్తూ ఉండేది. అయితే, ఈ నెల 5న డ్వాక్రా డబ్బులు తీసుకోవడానికి మల్లేశ్వరి అమలాపురం వెళ్లింది. కట్ చేస్తే.. 6వ తేదిన ఈ మహిళ కనిపించకుండాపోయింది.

వీరి కూతురుని మాత్రం నాగబాబు వారి బంధువుల వద్ద ఉంచి అతడు కూడా అదృశ్యమయ్యాడు. మల్లేశ్వరి కనిపించకుండాపోవడంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక ప్రాంతాల్లో గాలించారు. కానీ, ఆ మహిళ ఆచూకి మాత్రం దొరకలేదు. ఈ క్రమంలోనే గత శనివారం ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కట్ చేస్తే.. మల్లేశ్వరి అదే ప్రాంతంలోని ఓ పంట కాలువలో కుళ్లిన స్థితిలో శవమై కనిపించింది. రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, నాగబాబు కూడా కనిపించకుండాపోవడంతో అతనిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఇటీవల తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి