iDreamPost

రొమాంటిక్ కామెడీ చిత్రం నేరుగా OTTలోకి

  • Published Apr 14, 2024 | 6:45 PMUpdated Apr 14, 2024 | 6:45 PM

కోలీవుడ్ హీరో ఆశోక్ సెల్వన్, వసంత్ రవి, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పొన్ ఒండ్రు కండెన్’. అయితే రొమాంటిక్ కామెడీ, ట్రయాంగిల్‌ లవ్ స్టోరీగా రూపొందించిన ఈ సినిమా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకి ఎప్పుడంటే..

కోలీవుడ్ హీరో ఆశోక్ సెల్వన్, వసంత్ రవి, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పొన్ ఒండ్రు కండెన్’. అయితే రొమాంటిక్ కామెడీ, ట్రయాంగిల్‌ లవ్ స్టోరీగా రూపొందించిన ఈ సినిమా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకి ఎప్పుడంటే..

  • Published Apr 14, 2024 | 6:45 PMUpdated Apr 14, 2024 | 6:45 PM
రొమాంటిక్ కామెడీ చిత్రం నేరుగా OTTలోకి

కోలీవుడ్ హీరో ఆశోక్ సెల్వన్, వసంత్ రవి, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పొన్ ఒండ్రు కండెన్’. కాగా ఈ సినిమాకు ప్రియా కామాక్షి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ముందుగా..థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర యూనిటో ప్లాన్ చేసింది. కానీ, అంతలోనే ఈ సినిమాను ఆ చిత్ర యూనిట్ కు తెలియకుండా అందరికీ షాకిస్తూ నేరుగా టీవీలో విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటన వెలువడింది. ఇక దీనిని చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ ఈ సినిమాను కలర్స్ తమిళ్ అనే ఛానెల్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంటూ ఓ ప్రోమో కూడా వదిలింది. ఇక ఇది చూసిన నటుడు వసంత్ రవి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు పొన్ ఒండ్రు కండెన్ సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికార ప్రకటన వచ్చింది. ఇంతకి ఎప్పుడంటే..

రొమాంటిక్ కామెడీ, ట్రయాంగిల్‌ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న లేటెస్ట్ చిత్రం ‘పొన్ ఒండ్రు కండేన్’. కాగా, ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, వసంత్ రవి,  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  ఇక ఈ సినిమాను ప్రియా కామాక్షి  దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను జియో స్టూడియోస్, వైఎస్ఆర్ ఫిలింస్ బ్యానర్లపై యువన్ శంకర్ రాజా, జ్యోతి దేశ్ పాండే  నిర్మిస్తున్నారు. కాగా, గతకొన్ని రోజుల క్రితం ఈ సినిమా నేరుగా కలర్స్ తమిళ్ అనే ఛానెల్ లో అందుబాటులోకి రానుందని ప్రోమో చేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా పొన్ ఒండ్రు కండేన్ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఖరారు చేశారు.  కాగా, ఈ సినిమా ఈరోజు అనగా ఏప్రిల్ 14న మధ్యాహ్నం 2 గంటలకు స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.  అయితే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో సినిమాలో ఈ రోజు నుంచి స్ట్రీమింగా కానుంది. అంతే కాకుండా కలర్స్‌ టీవీ తమిళంలోనూ ఈ సినిమా  అందుబాటులోకి రానుంది. కాగా, ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. ఈ చిత్రంలో దీపా శంకర్, సచ్చు కీలక పాత్రలు పోషించారు. మరి,  ఐశ్వర్య లక్ష్మి, పొన్ ఒండ్రు కండేన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులో రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి