iDreamPost

అక్కడ కేఏ పాల్, ఇక్కడ పవన్ కళ్యాణ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్..!

అక్కడ కేఏ పాల్, ఇక్కడ పవన్ కళ్యాణ్..  ఇద్దరూ సేమ్ టు సేమ్..!

రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు పొలిటికల్ టూరిస్టులు మాదిరిగా తయారయ్యి, ప్రతి చిన్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తు న్నారు. అల్లరి చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.

ప్రజల తరపున పోరాడటానికి సమస్యలు లేక, తమ సొంత సమస్యలను ఎత్తి చూపుతూ పవన్, చంద్రబాబు రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారని ఆయన అన్నారు. ఇప్పటంలో ఎవ్వరి స్థలంలో నిర్మాణాలు పడకొట్టలేదని, 90 శాతం ఇప్పటం ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు.

మునుగోడులో కేఏ పాల్ మాదిరి, ఇప్పటంలో పవన్ కళ్యాణ్ ఫ్లైట్ దిగినప్పటి నుండి ఉరుకులు పరుగులు పెడుతూ కామెడీ చేస్తున్నాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు.దత్తపుత్రుడు పబ్ రెక్కీ చేస్తే, చంద్రబాబు గులకరాయితో రెక్కీ చేశారనడం వారి దివాలా కోరుతనానికి నిదర్శనమని, బాదుడే బాదుడు అన్నా దాంట్లో అర్థం తెలియక ఎవరో చంద్రబాబును గులకరాయితో రాయితో బాదారని కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన మీడియా సమావేశంలో కొడాలి నాని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి