iDreamPost

కట్టుకున్న భార్యపై కిరాతక భర్త దారుణం! అంతా చేసి చివరికి..!

కట్టుకున్న భార్యపై కిరాతక భర్త దారుణం! అంతా చేసి చివరికి..!

భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం సహజం. కానీ.. ఇంత దానికే కొందరు భర్తలు ఎవరూ ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో చివరికి హత్యలకు కూడా వెనకాడడం లేదు. అయితే అచ్చం ఇలాగే బరితెగించిన ఓ భర్త.. కట్టుకున్న భార్యపై కిరాతకానికి ఒడిగట్టాడు. ఇంతటి సరిపెట్టకుండా అతడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కేరళలోని కొల్లామ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో రహీమ్-నదిరా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే కాపురాన్ని కొనసాగించారు. ఇదిలా ఉంటే.. భర్త రహీమ్ పలు కేసుల్లో నిందితుడిగా ఉండడం విశేషం. ఇదే కాకుండా భార్యపై దాడి చేసిన కేసులో రహీమ్ ఇటీవలే జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలై బయటకు వచ్చాడు. అయితే ఈ క్రమంలోనే తాజాగా రహీమ్ భార్య పని చేసే చోటుకు వెళ్లాడు.
వెంటనే ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత తన గొంతు కోసుకుని స్థానికంగా ఉన్న ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కొందరు వ్యక్తులు స్పందించి నదిరాను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, ఫలితం లేకపోవడంతో ఆ మహిళ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి