iDreamPost

అధికారపార్టీలో చేరికలు.. ఎమ్మెల్యే బలరాం అనధికారికం.. కొడుకు అధికారికం..

అధికారపార్టీలో చేరికలు.. ఎమ్మెల్యే బలరాం అనధికారికం.. కొడుకు అధికారికం..

ఊహించినదే నిజమైంది. వైసీపీలో చేరుతున్నానని ప్రకటించిన టీడీపీ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అనధికారికంగానే పార్టీలో చేరారు. కొద్దిసేపటి క్రితం తన కుమారుడు కరణం వెంకటేష్‌తో కలసి కరణం బలరాం సీఎం జగన్‌ను కలిశారు. సీఎం జగన్‌కు ఎమ్మెల్యే కరణం పుష్పగుచ్ఛం అందించారు. వెంకటేష్‌కు జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కరణం వెంకటేష్, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలు మీడియా ముందుకొచ్చారు.

Read Also : కరణం బలరాం వైఎస్సార్‌సీపీలో అధికారికంగా చేరుతారా..?

జగనన్నపాలన మెచ్చి పార్టీలో చేరుతున్నామని కరణం వెంకటేష్‌ చెప్పారు. అందరితో కలసి పని చేసి చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. పథకాలు ప్రజలందరికీ అందించి వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీతో పార్టీని గెలిపిస్తామని వెంకటేష్‌ పేర్కొన్నారు. వారి వెంట ఎమ్మెల్సీ పోతుల సునీత, ఆమె భర్త పోతుల సురేష్, మాజీ మంత్రి పాలేటి రామారావు తదితరులున్నారు.  

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి