iDreamPost

నా ఫ్రెండ్ అంటూ మంచు విష్ణుకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కంగనా.. అతని వల్లే ఇదంతా..

నా ఫ్రెండ్ అంటూ మంచు విష్ణుకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కంగనా.. అతని వల్లే ఇదంతా..

బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ ప్రస్తుతం ‘ధాకడ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 20న థియేటర్లలో విడుదల కానుంది. గత కొద్ది రోజులుగా కంగనా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. తాజాగా కంగనా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

మే 16 సోమవారం ఉదయం కంగనా తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. ఆలయ అధికారులు VIP బ్రేక్ దర్శనంలో కంగనాకి ప్రత్యేక దర్శనం చేయించారు. కంగనాతో పాటు చిత్ర యూనిట్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కంగనా ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ.. నా ధాకడ్ సినిమా త్వరలో రిలీజ్ అవ్వనుంది. అందుకే గోవిందాని దర్శించుకోవడానికి వచ్చాను. సినిమా విజయవంతం కావాలని మొక్కుకున్నాను. మీ అందరి ఆశీస్సులు కూడా నా సినిమాకి కావాలి అని తెలిపింది.

ఆ తర్వాత కొన్ని తిరుమల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇవాళ పౌర్ణిమ రోజు నేను, ధాకడ్ నిర్మాత, మా చిత్ర యూనిట్ తిరుపతి బాలాజీని దర్శించుకున్నాం. మాకు ఇంత బాగా దర్శనం అవ్వడానికి, మాకు అన్ని సౌకర్యాలు సమకూర్చిన నా స్నేహితుడు మంచు విష్ణుకు, ధర్మారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అద్భుతమైన దర్శనం జరిగింది అని పోస్ట్ చేసింది. అయితే బాలీవుడ్ హీరోయిన్ మంచు విష్ణుని ట్యాగ్ చేసి అన్నీ అతనే అరేంజ్ చేసాడు అనడంతో మరోసారి ‘మా’ ప్రెసిడెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు.

View this post on Instagram

A post shared by Kangana Dhaakad (@kanganaranaut)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి