iDreamPost

XUV 700 కోటిన్నర పెట్టి అయిదు కార్లని కొన్న KA Paul

XUV 700 కోటిన్నర పెట్టి అయిదు కార్లని కొన్న  KA Paul

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ ఎప్పుడూ తనదైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా ఈసారీ KA పాల్ ఒకేసారి అయిదు కార్లని కొని వార్తల్లో నిలిచాడు. KA పాల్ 5 మహీంద్రా వైట్ కలర్ XUV700లను ఒకేసారి కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దీనికి డిమాండ్ ఉండటంతో ఎప్పుడో బుక్ చేసుకోగా కంపెనీ ఇటీవలే KA పాల్ కి డెలివరీ ఇచ్చింది.

వీటి ధర ఒక్కోటి దాదాపు 13 లక్షలకు పైగా ఉండటంతో.. కోటిన్నర పెట్టి అయిదు కార్లని కొన్నాను, వీటిని తెలంగాణలో రానున్న ఎన్నికల ప్రచారం కోసం వాడతాను అని KA పాల్ మీడియాతో తెలిపారు. ఇందులో పెట్రోల్, డీజిల్ రెండు వెహికల్స్ ఉండగా KA పాల్ పెట్రోల్ వెహికల్ ని తీసుకున్నారు. ఈ మహీంద్రా XUV700 సిటీలో 15 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లు. దీంట్లో 6 గేర్లు మ్యాన్యువల్, ఆటోమేటిక్ సెటప్ ఉంది.

XUV700 యొక్క పెట్రోల్ ఇంజన్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్. ఇది డైరెక్ట్ ఇంజెక్షన్ పొందుతుంది. ఈ వెహికల్ 200 kmph వరకు వేగాన్ని అందుకోగలదు. ఇందులో అయిదుగురివరకు కూర్చోవచ్చు. ఇలా KA పాల్ ఒకేసారి కోటిన్నర పెట్టి అయిదు కార్లని కొని, ఎలక్షన్ ప్రచారానికి వాడతాను అని చెప్పడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి