iDreamPost

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి NTRకి ఆహ్వానం!

  • Published Jan 17, 2024 | 10:46 PMUpdated Jan 17, 2024 | 10:46 PM

Jr NTR Receives Invitation Opening of Ram Mandir: ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో నిర్మించిన శ్రీ రామ మందిరం జనవరి 22న అంగరంగ వైభవంగా ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమాానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం పంపించారు.

Jr NTR Receives Invitation Opening of Ram Mandir: ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో నిర్మించిన శ్రీ రామ మందిరం జనవరి 22న అంగరంగ వైభవంగా ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమాానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం పంపించారు.

  • Published Jan 17, 2024 | 10:46 PMUpdated Jan 17, 2024 | 10:46 PM
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి NTRకి ఆహ్వానం!

ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా అయోధ్య పేరే వినిపిస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఆ రోజున శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగ నిర్వహణ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 22 న జరగబోయే ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ప్రముఖుల మద్య ఈ ఆలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఈ మహోత్సవానికి రావాలంటూ దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ రామ మందిరం జనవరి 22న ప్రారంభోత్సవం జరుగనుంది. ఈ వేడుకకు పలువురు రాజకీయ, మత పెద్దలతో పాటు సినీ ప్రముఖులను ఆహ్వానం పంపినట్లు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్‌ల తో పాటు తాజాగా ఎన్టీఆర్ కి కూడా ఆహ్వానం అందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన అమితాబచ్చన్, రజినీకాంత్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్,రిషబ్ శెట్టి, ధనుష్, అనుపం ఖేర్, మాధురీ దీక్షిత్ కు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. వీరితో పాటు అజయ్ దేవగన్, రణబీర్ కపూర్ దంపతులు, సన్నీడియోల్, టైగర్ ష్రాఫ్, యష్ లతో పాటు ప్రముఖ దర్శకులు రాజ్ కుమార్ హిరానీ,సంజయ్ లీలా బన్సాలీ, రోహిత్ శెట్టి, నిర్మాత అయిన మహావీర్ జైన్ లకు ఆహ్వానాలు పంపారు. వారణాసికి చెందిన వేద పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22 న శ్రీరాముని విగ్రహానికి పట్టాభిషేకం చేసి ప్రధాన ఆచారాలు నిర్వహించనున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర షూటింగ్ లో ఉన్నారు ఎన్టీఆర్. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన గ్లింబ్స్ రిలీజ్ చేశారు. దేవర మూవీలో ఎన్టీఆర్ లుక్ కి ఫ్యాన్స్ నుంచి తెగ రెస్పాన్స్ వస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ తొలిసారిగా తెలుగు తెరపై కనిపించబోతుంది. విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, షైన్ టామ్ చాకో నటిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి