iDreamPost

జార్ఖండ్ ఫలితాలపై చిదంబరం కౌంటర్

జార్ఖండ్ ఫలితాలపై చిదంబరం కౌంటర్

జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా వచ్చాయి. కాంగ్రెస్ జెఎంఎం కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 25 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యింది. దాంతో బీజేపీ ఓటమి అనివార్యంగా కనిపిస్తుంది. జార్ఖండ్ లో మొత్తం 81 స్థానాలకు ఎన్నికలు జరగగా మ్యాజిక్ ఫిగర్ కు 41 స్థానాల్లో గెలుపొందాలి.

జార్ఖండ్ లో బీజేపీ పార్టీ ఓటమి చెందుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చిదంబరం ట్విట్టర్ వేదికగా బీజేపీకి కౌంటర్‌ ఇచ్చారు. హర్యాణాలో దెబ్బతిన్నారు. మహారాష్ట్రలో వద్దనిపించుకున్నారు. ఝార్ఖండ్‌లో ఓడిపోయారు. 2019లో భాజపా కథ ఇది. బీజేపీయేతర పార్టీలన్నీ దీనిపై దృష్టిపెట్టాలి. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్‌తో కలిసి రావాలి అని చిదంబరం ట్వీట్‌ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి