iDreamPost

దేవర షూటింగ్‌ వేళ.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ!

దేవర షూటింగ్‌ వేళ.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ!

బాలీవుడ్‌ హీరోయిన్‌, అందాల తార శ్రీదేవి గారాల పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ తెలుగులో తొలి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’లో ఆమె హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా చేస్తున్నారు. ఇక, దేవర సినిమా శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో జాన్వీ తన పోర్షన్‌ షూట్‌ కోసం ఎక్కువగా హైదరాబాద్‌లో సమయం గడుపుతున్నారు. దేవర షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

తాజాగా, షూటింగ్‌ నుంచి బ్రేక్‌ దొరకటంతో జాన్వీ దైవ దర్శనానికి వెళ్లిపోయారు. సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున తెలుగు దనం ఉట్టిపడేలా చీర కట్టులో శ్రీవారిని దర్శించుకున్నారు.  దర్శనం అనంతరం గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత పంచాంగ నమస్కారం చేశారు. ఇక, జాన్వీ గుడికి వచ్చిందన్న విషయం తెలియగానే భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవటానికి ఎగబడ్డారు.

జాన్వీ శ్రీవారిని దర్శించుకున్న దృశ్యాల తాలూకా వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, జాన్వీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పరమ భక్తురాలన్న సంగతి తెలిసిందే. ప్రతీ ఏటా క్రమం తప్పకుండా ఆమె తిరుమలకి వస్తూ ఉంటారు. తల్లి శ్రీదేవి కారణంగా ఆమెకు శ్రీవారిపై భక్తి కలిగిందని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే తల్లి మార్గంలోనే జాన్వీ నడుస్తోంది. తల్లి మూలాల్లో ఒకటైన తెలుగును కూడా ఆమె దూరం చేసుకోవటం లేదు. తెలుగులో సినిమాలు చేయటానికి పూనుకున్నారు. మరి, జాన్వీ కపూర్‌కు తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి