iDreamPost

Robin Minz: పదో తరగతితో చదువు బంద్.. అయినా రూ.కోట్లు కొల్లగొట్టాడు! ఎవరీ రాబిన్ మింజ్?

  • Published Dec 20, 2023 | 12:58 PMUpdated Dec 20, 2023 | 12:58 PM

టాలెంట్​ ఉంటే చాలు.. ఏదైనా సాధ్యమేనని మరో యంగ్ క్రికెటర్ ప్రూవ్ చేశాడు. ఎంచుకున్న కెరీర్​లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి కష్టపడితే అనుకున్న టార్గెట్​ను రీచ్ అవ్వొచ్చని చేసి చూపించాడు. ఆ ప్లేయరే రాబిన్ మింజ్.

టాలెంట్​ ఉంటే చాలు.. ఏదైనా సాధ్యమేనని మరో యంగ్ క్రికెటర్ ప్రూవ్ చేశాడు. ఎంచుకున్న కెరీర్​లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి కష్టపడితే అనుకున్న టార్గెట్​ను రీచ్ అవ్వొచ్చని చేసి చూపించాడు. ఆ ప్లేయరే రాబిన్ మింజ్.

  • Published Dec 20, 2023 | 12:58 PMUpdated Dec 20, 2023 | 12:58 PM
Robin Minz: పదో తరగతితో చదువు బంద్.. అయినా రూ.కోట్లు కొల్లగొట్టాడు! ఎవరీ రాబిన్ మింజ్?

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఎందరో అనామకులను ఓవర్​నైట్ స్టార్లను చేసింది. ఈ లీగ్​లో ఆడటం ద్వారా చాలా మంది రూ.కోట్లకు పడగలెత్తారు. పేదరికం నుంచి వచ్చిన కొంత మంది ఆటగాళ్లు క్యాష్ రిచ్​ లీగ్​లో ఆడి కోటీశ్వరులు అయ్యారు. ఐపీఎల్​లో రాణించి తద్వారా టీమిండియాకు ఆడిన మహ్మద్ సిరాజ్ లాంటి వాళ్లు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఆటో డ్రైవర్ కొడుకైన సిరాజ్ మియా ఇవాళ ఏ రేంజ్​లో ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఇక, ఈసారి ఐపీఎల్​ ఆక్షన్​లో ఓ సెక్యూరిటీ గార్డ్ కొడుకు రూ.కోట్లు కొల్లగొట్టాడు. గిరిజన కుటుంబానికి చెందిన ఆ ప్లేయర్ పేరు రాబిన్ మింజ్. పదో తరగతితో చదువు ఆపేసిన ఈ కుర్రాడు ఐపీఎల్-2024 ఆక్షన్​లో​ చర్చనీయాంశంగా మారాడు.

అసలు ఎవరీ రాబిన్ మింజ్? అతడి కోసం వేలంలో పాపులర్ ఫ్రాంచైజీలు అన్నీ ఎందుకు పోటీపడ్డాయో ఇప్పుడు చూద్దాం.. జార్ఖండ్​కు చెందిన మింజ్​ను గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.3.6 కోట్లకు దక్కించుకుంది. అతడి కోసం జీటీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్​రైజర్స్ హైదరాబాద్ పోటీపడ్డాయి. అయితే చివరికి గుజరాత్​ అతడ్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ ఆక్షన్ హిస్టరీలో అమ్ముడుపోయిన మొట్టమొదటి గిరిజన క్రికెటర్​గా నిలిచి రికార్డు సృష్టించాడు మింజ్. ఇండియన్ పొలార్డ్​గా గుర్తింపు తెచ్చుకున్న అతడు ఓ గిరిజన తెగకు చెందినవాడు. 21 ఏళ్ల మింజ్​ది జార్ఖండ్​లోని గుమా జిల్లా. అతడిది మిడిల్​ క్లాస్ ఫ్యామిలీ. రాబిన్ తండ్రి జార్ఖండ్ ఎయిర్​ఫోర్స్ సెక్యూరిటీలో పనిచేస్తున్నాడు. అయితే చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఇష్టం పెంచుకున్న మింజ్.. చదువును పూర్తిగా పక్కన పెట్టేశాడు.

పదో తరగతి తర్వాత చదువును బంద్ చేశాడు మింజ్. అనంతరం క్లబ్ క్రికెట్, అండర్​-19, అండర్-25 టోర్నమెంట్స్​లో జార్ఖండ్ తరఫున అద్భుతంగా ఆడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. క్లబ్ క్రికెట్​లో రాబిన్ 140కు పైగా స్ట్రైక్ రేట్​తో చెలరేగి ఆడాడు. దీంతో ఈ సంవత్సరం ఆగస్టులో యూకే వేదికగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ట్రైనింగ్ క్యాంప్​కు ఈ వికెట్ కీపర్ బ్యాట్స్​మన్​ ఎంపికయ్యాడు. డొమెస్టిక్ టీ20 క్రికెట్​లోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడా సత్తా చాటాడు. ఒడిశాలో జరిగిన ఒక టీ20 టోర్నమెంట్​లో కేవలం 35 బంతుల్లోనే 75 రన్స్ చేసి నాటౌట్​గా నిలిచాడు. భారత లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీని ఇన్​స్పిరేషన్​గా తీసుకొని క్రికెట్​ను కెరీర్​గా ఎంచుకున్నాడతను.

కీపింగ్, బ్యాటింగ్​తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు మింజ్. ఇంత టాలెంట్ ఉంది కాబట్టే అతడి కోసం వేలంలో ఫ్రాంచైజీలన్నీ పోటీపడ్డాయి. అతడి కోసం సన్​రైజర్స్ హైదరాబాద్ ఆఖరి వరకు ప్రయత్నించింది. కానీ పర్స్​లో ఉన్న రూ.3.4 కోట్లు సరిపోకపోవడంతో మిస్ చేసుకుంది. పదో తరగతి తర్వాత చదువు మానేసి క్రికెట్​ను కెరీర్​గా ఎంచుకొని ఐపీఎల్​కు సెలక్ట్ అయిన మింజ్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. లైఫ్​లో ఏది చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేస్తే సాధ్యమేనని అతడు ప్రూవ్ చేశాడని అంటున్నారు. మరి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్​తో వచ్చి వేలంలో మింజ్ రూ.కోట్లు కొల్లగొట్టడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPL 2024 Auction: జాక్ పాట్ కొట్టిన ధోని అభిమాని! కోట్లు పలికిన అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీరే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి