iDreamPost

కోహ్లీ, మ్యాక్సీ కాదు.. RCB ఆశలన్నీ ఆ ఇద్దరి మీదే! ముంచుతారో? తేల్చుతారో?

  • Published Mar 21, 2024 | 3:39 PMUpdated Mar 21, 2024 | 3:39 PM

ఈసారి ఎలాగైనా ఐపీఎల్ కప్పు ఎగరేసుకుపోవాలని ఆర్సీబీ చూస్తోంది. అయితే ఆ టీమ్ కోహ్లీ, మాక్స్​వెల్ లాంటి సూపర్ స్టార్ల మీద కాకుండా ఆ ఇద్దరి మీదే ఎక్కువ ఆశలు పెట్టుకుంది.

ఈసారి ఎలాగైనా ఐపీఎల్ కప్పు ఎగరేసుకుపోవాలని ఆర్సీబీ చూస్తోంది. అయితే ఆ టీమ్ కోహ్లీ, మాక్స్​వెల్ లాంటి సూపర్ స్టార్ల మీద కాకుండా ఆ ఇద్దరి మీదే ఎక్కువ ఆశలు పెట్టుకుంది.

  • Published Mar 21, 2024 | 3:39 PMUpdated Mar 21, 2024 | 3:39 PM
కోహ్లీ, మ్యాక్సీ కాదు.. RCB ఆశలన్నీ ఆ ఇద్దరి మీదే! ముంచుతారో? తేల్చుతారో?

ఐపీఎల్-2024 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ రెడీ అవుతోంది. సీజన్​లోని తొలి మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్​తో తలపడనుంది ఆర్సీబీ. ఇప్పటికే ఆ జట్టు ఆటగాళ్లు చెన్నైకి చేరుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన సీఎస్​కేను ఓడించి టోర్నీని పాజిటివ్​గా స్టార్ట్ చేయాలని బెంగళూరు అనుకుంటోంది. అయితే అన్ని విభాగాల్లోనూ ఎంతో బలంగా ఉన్న ధోని సేనను ఓడించడం అంత ఈజీ కాదు. బెస్ట్ గేమ్​ ఆడితే తప్ప సీఎస్‌కేను మట్టికరిపించలేరు. ఈ నేపథ్యంలో వ్యూహాలు పన్నడంలో బిజీ అయిపోయిన ఆర్సీబీ మేనేజ్​మెంట్ ఈసారి ఇద్దరు ప్లేయర్ల మీదే గంపెడాశలు పెట్టుకుంది. విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్​వెల్ కాకుండా ఆ జట్టు స్ట్రాటజీలో కీలంగా మారిన ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..

ఆల్​రౌండర్ కామెరాన్ గ్రీన్, స్పీడ్​స్టర్ మహ్మద్ సిరాజ్ మీద ఆర్సీబీ మీద భారీగా ఆశలు పెట్టుకుంది. ఓపెనర్​గా భీకర ఫామ్​లో ఉన్న గ్రీన్ మరోసారి తన బ్యాట్ పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. బ్యాటింగ్​తో పాటు కొన్ని ఓవర్లు పేస్ బౌలింగ్ చేయగల సామర్థ్యం కూడా అతడికి ఉంది. కాబట్టి అతడు ఓపెనర్​గా మంచి ఆరంభాలు ఇస్తూ, బౌలర్​గా అవసరమైన టైమ్​లో బ్రేక్ త్రూలు అందించాలని బెంగళూరు మేనేజ్​మెంట్ భావిస్తోంది. బౌలింగ్​ అటాక్​ను లీడ్ చేయనున్న సిరాజ్​ ఈ సీజన్​లో ఆర్సీబీకి మరింత కీలకం కానున్నాడు. ఫామ్​, ఫిట్​నెస్​, ఎక్స్​పీరియెన్స్ పరంగా అతడికి సాటి వచ్చే మరో పేస్ బౌలర్ టీమ్​లో లేడు. అందుకే సిరాజ్ తప్పకుండా రాణించాలని కోరుకుంటోంది. అతడు బౌలింగ్​లో చెలరేగితే ప్రత్యర్థి జట్లను భారీ స్కోర్లు చేయకుండా నిలువరించొచ్చని అనుకుంటోంది ఆర్సీబీ.

RCB managment focus on 2 players only

అపోజిషన్ టీమ్స్ అంతా ఆర్సీబీలో కోహ్లీ, మాక్స్​వెల్, డుప్లెసిస్ మీదే ఫోకస్ పెడతాయి. కాబట్టి ప్రత్యర్థులు కోలుకునే లోపు గ్రీన్, సిరాజ్ వాళ్లను చావుదెబ్బ కొట్టొచ్చు. కోహ్లీ, మ్యాక్సీపై నుంచి ఇతరుల వైపు ఫోకస్ షిఫ్ట్ అయ్యే లోగా టోర్నీలో లీడింగ్​లోకి వెళ్లిపోవాలని ఆర్సీబీ ప్లానింగ్​గా కనిపిస్తోంది. అందుకు తగ్గట్లే ప్రాక్టీస్ సెషన్స్​లో సిరాజ్, గ్రీన్ మీద బెంగళూరు మేనేజ్​మెంట్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. గత సీజన్​లో ఓపెనర్​గా దిగి సక్సెస్ అయిన కోహ్లీని కాదని.. గ్రీన్​ను ఆ పొజిషన్​లో ఆడించాలని ఫిక్స్ అయిందట. కోహ్లీ, మాక్స్​వెల్ లాంటి వాళ్లు ఎలాగైనా బాగా ఆడతారు. గ్రీన్, సిరాజ్ రాణిస్తేనే ఇటు బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ టీమ్ బలోపేతం అవుతుందని, విజయాలు వస్తాయని ఆశిస్తోందట. మరి.. సిరాజ్, గ్రీన్ ఆర్సీబీని గట్టెక్కిస్తారని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: వీడియో: హార్ధిక్‌ పాండ్యాను కాకితో పోల్చిన రోహిత్‌ శర్మ! ఎందుకంటే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి