iDreamPost

MS Dhoni: వీడియో: మా టీమ్​లోకి వస్తావా? RCB ఫ్యాన్​ ప్రశ్నకు ధోని షాకింగ్ రిప్లయ్!

  • Published Dec 21, 2023 | 10:48 AMUpdated Dec 21, 2023 | 10:48 AM

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఓ ఆర్సీబీ అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. తమ టీమ్​లోకి వస్తావా? అని ఆ ఫ్యాన్ మాహీని అడిగాడు. దీనికి సీఎస్​కే సారథి షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఓ ఆర్సీబీ అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. తమ టీమ్​లోకి వస్తావా? అని ఆ ఫ్యాన్ మాహీని అడిగాడు. దీనికి సీఎస్​కే సారథి షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు.

  • Published Dec 21, 2023 | 10:48 AMUpdated Dec 21, 2023 | 10:48 AM
MS Dhoni: వీడియో: మా టీమ్​లోకి వస్తావా? RCB ఫ్యాన్​ ప్రశ్నకు ధోని షాకింగ్ రిప్లయ్!

మహేంద్ర సింగ్ ధోని.. క్రికెట్​తో పరిచయం లేని వారికి కూడా తెలిసిన పేరిది. తన బ్యాటింగ్, కెప్టెన్సీ స్కిల్స్​తో టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాలను, ట్రోఫీలను అందించాడు మాహీ. ఆధునిక క్రికెట్​కు బ్రాండ్ అంబాసిడర్​గా నిలిచాడతను. కెప్టెన్​గా భారత టీమ్​ను ఎంత సక్సెస్​ఫుల్​గా ముందుకు తీసుకెళ్లాడో.. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో చెన్నై సూపర్ కింగ్స్​ జట్టునూ అంతే విజయవంతంగా నడిపాడు ధోని. నెక్స్ట్ సీజన్​లో కూడా సీఎస్​కేను ముందుండి లీడ్ చేయనున్నాడు. అయితే ధోని లాంటి కెప్టెన్ తమ టీమ్​కు ఉండాలని, కప్ గెలిపించాలని ఇతర ఫ్రాంచైజీల అభిమానులు కోరుకోవడంలో తప్పు లేదు. అందులోనూ లీగ్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ తమకు మాహీ లాంటి సారథి కావాలనుకోవడం సహజమే.

ఇలాగే ఒక ఆర్సీబీ ఫ్యాన్ తమకు ధోనీనే కెప్టెన్​గా కావాలని అన్నాడు. ఈ విషయాన్ని నేరుగా మాహీకే చెప్పాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నై సారథని ఓ బెంగళూరు అభిమాని వెరైటీ క్వశ్చన్ అడిగాడు. తాను ఆర్సీబీ ఫ్యాన్​నని.. అయితే మీరు మా టీమ్​లోకి వచ్చి ఎలాగైతే చెన్నైకి ఐదు టైటిల్స్ అందించారో, అలాగే మాకూ ఓ కప్ అందించాలని కోరాడు. అయితే దీనికి ధోని తనదైన స్టైల్​లో రిప్లయ్ ఇచ్చాడు. ఆర్సీబీ మంచి జట్టు అని అన్నాడు. ‘క్రికెట్​లో ప్రతిదీ మనం అనుకున్నట్లుగా, ప్లాన్ చేసినట్లుగా జరగదు. ఐపీఎల్​లో ఉన్న 10 టీమ్స్ చాలా పవర్​ఫుల్. అయితే ఇంజ్యురీల వల్ల కొన్నిసార్లు ఫుల్ స్ట్రెంగ్త్​తో ఆడటం కుదరదు. ఆర్సీబీ మంచి జట్టు. ఇక్కడ గెలిచేందుకు ప్రతి టీమ్​కూ ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేను నా సొంత జట్టు (చెన్నై) గురించే ఆలోచిస్తున్నా. కాబట్టి ఏ టీమ్​కైనా మంచి జరగాలని మాత్రమే కోరుకోగలను’ అని ధోని చెప్పుకొచ్చాడు.

ఏ టీమ్ అయినా బాగా ఆడాలని కోరుకోగలనని.. అంతకంటే ఏమీ చేయలేనని అన్నాడు ధోని. ఎందుకంటే తాను ఇంకో టీమ్​కు సపోర్ట్ చేస్తే తమ టీమ్ ఫ్యాన్స్ ఎలా అనుకుంటారో ఆలోచించాలని ఎదురు ప్రశ్న వేశాడు. తాను ఇంకో జట్టుకు మద్దతుగా నిలిస్తే చెన్నై ఫ్యాన్స్ ఊరుకోరని పేర్కొన్నాడు ధోని. ఇక, ఈసారి ఐపీఎల్ ఆక్షన్​లో సీఎస్​కే వ్యూహాత్మకంగా, ఒక ప్లానింగ్ ప్రకారం వ్యవహరించి తమ టీమ్ కాంబినేషన్​లో సెట్ అయ్యే ప్లేయర్లను తీసుకుంది. డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్​తో పాటు సమీర్ రిజ్వీ వంటి ప్రతిభావంతులైన యంగ్ క్రికెటర్స్​నూ సొంతం చేసుకుంది. అలాగే సిరిసిల్ల కుర్రాడు అరవెల్లి అనవీశ్​ రావుకూ ఛాన్స్ ఇచ్చింది. టీమిండియా ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్​ను కూడా వేలంలో దక్కించుకుంది సీఎస్​కే. అతడి రాక వల్ల అటు బౌలింగ్​ బలోపేతం అవడంతో పాటు ఇటు బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది. మరి.. ఆర్సీబీ అభిమాని అడిగిన ప్రశ్నకు ధోని ఇచ్చిన సమాధానంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో చివరి వన్డే.. ఒక్క మార్పుతో బరిలోకి టీమిండియా!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి