iDreamPost

ఓడిపోయే మ్యాచ్​లో థ్రిల్లింగ్ విక్టరీ.. లక్నో విజయానికి 5 కారణాలు!

  • Published Mar 31, 2024 | 10:39 AMUpdated Mar 31, 2024 | 10:39 AM

చేజారిందనుకున్న మ్యాచ్​లో లక్నో సూపర్ జియాంట్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఆ టీమ్ విజయానికి గల 5 కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

చేజారిందనుకున్న మ్యాచ్​లో లక్నో సూపర్ జియాంట్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఆ టీమ్ విజయానికి గల 5 కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 31, 2024 | 10:39 AMUpdated Mar 31, 2024 | 10:39 AM
ఓడిపోయే మ్యాచ్​లో థ్రిల్లింగ్ విక్టరీ.. లక్నో విజయానికి 5 కారణాలు!

మరో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్​కు ఐపీఎల్-2024 వేదికగా నిలిచింది. గెలుపు ఖాయం అనుకున్న టీమ్ ఓటమి మూటగట్టుకుంది. చేజేతులా ఓడిపోయింది. మ్యాచ్ పోయిందని అనుకున్న టైమ్​లో ఓ ప్లేయర్ చేసిన మ్యాజిక్ వల్ల మరో టీమ్ విక్టరీ కొట్టింది. అదే లక్నో సూపర్ జియాంట్స్​కు పంజాబ్ కింగ్స్​కు మధ్య జరిగిన మ్యాచ్. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఛేజింగ్​కు దిగిన పంజాబ్ ఓవర్లన్నీ ఆడి 5 వికెట్లకు 178 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్​లో లక్నో విజయానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

బ్యాటింగ్

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 199 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (38 బంతుల్లో 54) తిరిగి ఫామ్​ను అందుకున్నాడు. కొత్త కెప్టెన్ నికోలస్ పూరన్ (21 బంతుల్లో 42) మెరుపు బ్యాటింగ్​తో అలరించాడు. ఉన్నంత సేపు బౌండరీలు, సిక్సులతో పంజాబ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఆఖర్లో కృనాల్ పాండ్యా (22 బంతుల్లో 43 నాటౌట్) కూడా ధనాధన్ ఇన్నింగ్స్​ ఆడాడు. అతడి వల్లే స్కోరు 200కు చేరువైంది. దీంతో ఛేజింగ్​కు దిగిన పంజాబ్​ మీద ఒత్తిడి మొదలైంది.

5 Reasons for Success!

బౌలింగ్

ఈ మ్యాచ్​లో లక్నో బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లో కూడా ఆకట్టుకుంది. మొదటి 10 ఓవర్ల వరకు ఆ టీమ్ బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత కొత్త బౌలర్ మయాంక్ యాదవ్ ఫాస్టెస్ట్ డెలివరీస్​తో పంజాబ్​ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో మిగిలిన బౌలర్లు కూడా పుంజుకున్నారు. డాట్ బాల్స్​తో ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచారు. మయాంక్ 3 వికెట్లు తీసి మ్యాచ్​ను మలుపు తిప్పాడు. మోసిన్ ఖాన్ 2 వికెట్లతో అతడికి మంచి సహకారం అందించాడు.

మయాంక్ యాదవ్

ఈ మ్యాచ్​లో లక్నో విజయానికి ప్రధాన కారణం స్పీడ్​స్టర్ మయాంక్. 150 కిలోమీటర్లకు తగ్గని వేగంతో నిలకడగా బంతులు వేస్తూ పంజాబ్ బ్యాటర్లకు ఓ రేంజ్​లో పోయించాడు. అతడి బౌలింగ్​ను ఎదుర్కొనేందుకు బెయిర్​స్టో లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్ కూడా భయపడ్డాడు. బెయిర్​స్టో, ప్రభుసిమ్రన్ సింగ్, జితేష్ శర్మను ఔట్ చేసి మ్యాచ్​ను లక్నో వైపు తిప్పాడు మయాంక్. 11 ఓవర్లకు 102 స్కోరుతో ఉన్న పంజాబ్.. ఓవర్లన్నీ ముగిసేసరికి విజయానికి 21 పరుగుల దూరంలో ఆగిపోయింది. దానికి ప్రధాన కారణం మయాంక్ వేసిన అద్భుతమైన స్పెల్ అనే చెప్పాలి.

కెప్టెన్సీ

గాయం తర్వాత కమ్​బ్యాక్ ఇస్తున్న రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్​కు రెస్ట్ ఇచ్చే ఉద్దేశంతో అతడ్ని బ్యాటింగ్​కే పరిమితం చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్​గా ఆడించారు. అతడి ప్లేస్​లో నికోలస్ పూరన్​ కెప్టెన్ అవతారం ఎత్తాడు. బ్యాటింగ్​లో 42 పరుగులతో అదరగొట్టిన పూరన్.. ఆ తర్వాత బౌలింగ్ ఛేంజెస్, ఫీల్డింగ్ పొజిషన్స్​తోనూ ఆకట్టుకున్నాడు. కొత్త బౌలర్ మయాంక్​ను అతడు వాడుకున్న తీరు బాగుంది.

టాస్

ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గడం లక్నోకు కలిసొచ్చింది. టాస్ గెలిచాక బ్యాటింగ్ ఎంచుకొని భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్​కు దిగారు కాబట్టి వాళ్ల మీద అంత ప్రెజర్ లేదు. అదే ఒకవేళ ఛేజింగ్ చేయాల్సి వస్తే ఇబ్బంది పడేవాళ్లు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి