iDreamPost

IPL 2024పై డివిలియర్స్ ప్రెడిక్షన్.. ఈసారి ఆ టీమ్​దే కప్పు అంటూ..!

  • Published Mar 21, 2024 | 11:03 AMUpdated Mar 21, 2024 | 11:03 AM

సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఈసారి ఐపీఎల్​లో ఎవరు గెలుస్తారో చెప్పేశాడు. తన ప్రెడిక్షన్ ప్రకారం ఆ జట్టే విజేతగా నిలుస్తుందని అన్నాడు.

సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఈసారి ఐపీఎల్​లో ఎవరు గెలుస్తారో చెప్పేశాడు. తన ప్రెడిక్షన్ ప్రకారం ఆ జట్టే విజేతగా నిలుస్తుందని అన్నాడు.

  • Published Mar 21, 2024 | 11:03 AMUpdated Mar 21, 2024 | 11:03 AM
IPL 2024పై డివిలియర్స్ ప్రెడిక్షన్.. ఈసారి ఆ టీమ్​దే కప్పు అంటూ..!

ఐపీఎల్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ మొదలవడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఈ సీజన్​లోని ఆరంభ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్​తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. చెపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్​ కోసం ఇప్పటికే ఆర్సీబీ జట్టు అక్కడికి చేరుకుంది. ధోని సేన ఆల్రెడీ చెపాక్​లోనే ప్రాక్టీస్ చేస్తోంది. సీజన్ స్టార్టింగ్ మ్యాచే సీఎస్​కే, ఆర్సీబీ లాంటి టాప్ టీమ్స్ మధ్య ఉండటంతో హైప్ భారీగా నెలకొంది. ఈ మ్యాచ్​తో పాటు టోర్నీలోని మిగతా మ్యాచుల్లో ఎవరు గెలుస్తారు? కప్పు ఎవరు కొడతారు? అనేది అందరూ చర్చించుకుంటున్నారు. మాజీ క్రికెటర్లు దీనిపై రకరకాల ప్రెడిక్షన్స్ ఇస్తున్నారు. సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ కూడా తన ప్రెడిక్షన్ చెప్పేశాడు. ఈసారి క్యాష్ రిచ్ లీగ్​లో టైటిల్ సొంతం చేసుకునేది ఆ జట్టేనని అన్నాడు.

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, గతేడాది రన్నరప్ గుజరాత్ టైటాన్స్​ మీద ఈ సీజన్​లో భారీగా అంచనాలు ఉన్నాయి. మిగతా అన్ని జట్లు కూడా పటిష్టంగానే కనిపిస్తున్నా వీటి మీదే అందరి ఫోకస్ ఉంది. అయితే డివిలియర్స్ మాత్రం ఈ రెండు జట్లు కాదని ఆర్సీబీకి మొగ్గు చూపుతున్నాడు. ఈసారి ఐపీఎల్​లో కప్పు కొట్టేది బెంగళూరేనని జోస్యం చెప్పాడు. విమెన్స్ ప్రీమియర్ లీగ్​లో ఆర్సీబీ మహిళా జట్టు విజేతగా నిలిచింది కాబట్టి.. పురుషుల జట్టు కూడా దాన్ని కంటిన్యూ చేయాలని సూచించాడు. క్రికెట్​లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేరని, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏదైనా బోరింగ్​గా ఉంటుందన్నాడు ఏబీడీ. ఈసారి ఆర్సీబీ కప్పు కొడుతుందని తాను బలంగా నమ్ముతున్నానని తెలిపాడు. డివిలియర్స్ వ్యాఖ్యలతో ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్​ లీ ఏకీభవించాడు.

De Villiers Prediction on IPL 2024

ఈసారి ఐపీఎల్​లో విజేతగా నిలిచే అవకాశాలు ఆర్సీబీకి ఎక్కువగా ఉన్నాయని బ్రెట్ లీ చెప్పాడు. ఇక, ఈ సీజన్​లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటే కూడా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చూసేందుకు తాను ఎగ్జయిటింగ్​గా ఉన్నానని డివిలియర్స్ అన్నాడు. ‘జైస్వాల్ ఆట చూసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా. తన బ్యాట్ పవరో ఏంటో టెస్ట్ ఫార్మాట్​లో అతడు చూపించాడు. ఇప్పుడు టీ20ల్లో తన టాలెంట్ చూపించాల్సిన టైమ్ వచ్చేసింది. ఇంగ్లండ్ సిరీస్​లో అద్భుతంగా ఆడటంతో అతడు సూపర్ కాన్ఫిడెన్స్​తో ఉన్నాడు. దీంతో ఐపీఎల్​లోనూ మెరుపులు మెరిపిస్తాననే నమ్మకంతో జైస్వాల్ కనిపిస్తున్నాడు. ఈ సీజన్​లో అతడు కనీసం 500 నుంచి 600 పరుగులు చేస్తాడని అనుకుంటున్నా’ అని డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. మరి.. ఆర్సీబీదే కప్పు అంటూ ఏబీడీ చేసిన ప్రెడిక్షన్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి