iDreamPost

IND vs SA: టీమిండియాలో అతడ్ని ఎందుకు ఆడిస్తున్నారు? తీసేయండి అంటున్న నెటిజన్స్!

  • Published Dec 30, 2023 | 5:52 PMUpdated Dec 31, 2023 | 2:47 PM

టీమిండియాలో ఆ ప్లేయర్​ అవసరం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. అతడ్ని జట్టులో నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.

టీమిండియాలో ఆ ప్లేయర్​ అవసరం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. అతడ్ని జట్టులో నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Published Dec 30, 2023 | 5:52 PMUpdated Dec 31, 2023 | 2:47 PM
IND vs SA: టీమిండియాలో అతడ్ని ఎందుకు ఆడిస్తున్నారు? తీసేయండి అంటున్న నెటిజన్స్!

క్రికెట్​లో గెలుపోటములు సహజమే అయినా కొన్ని మ్యాచులు, టోర్నమెంట్స్​లో వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కొన్నిసార్లు టీమ్స్ ఓడితే ప్రేక్షకులు, అభిమానులు అస్సలు ఊరుకోరు. బాగా ఆడినప్పుడు పొగిడిన వాళ్లే ఫెయిలైనప్పుడు విమర్శలు గుప్పిస్తారు. ఇప్పుడు టీమిండియా పరిస్థితి ఇలాగే ఉంది. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్​ ఫైనల్​ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రోహిత్ సేన.. సౌతాఫ్రికా టూర్​ను బాగానే స్టార్ట్ చేసింది. టీ20 సిరీస్​ను డ్రా చేసుకున్న భారత్.. వన్డే సిరీస్​ను ఎగరేసుకుపోయింది. దీంతో చాన్నాళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న టెస్ట్ సిరీస్​నూ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ తొలి టెస్ట్​లో ఇన్నింగ్స్ 32 రన్స్ భారీ తేడాతో ఓడటాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. భారత జట్టు ఆటగాళ్లపై విమర్శలకు దిగుతున్నారు. ముఖ్యంగా టీమ్​లోని ఓ ఆల్​రౌండర్​ను టార్గెట్ చేసుకొని కామెంట్స్ చేస్తున్నారు. అతడే శార్దూల్ ఠాకూర్.

తొలి టెస్ట్​లో ఫెయిలైన శార్దూల్ ఠాకూర్​ను టీమ్​లో నుంచి తీసేయాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఆ మ్యాచ్​లో 19 ఓవర్లు బౌలింగ్ చేసిన బౌలింగ్ ఆల్​రౌండర్.. ఏకంగా 101 పరుగులు ఇచ్చుకున్నాడు. అటు బ్యాటింగ్​లోనూ పెద్దగా రాణించలేదు. మొదటి ఇన్నింగ్స్​లో 33 బంతులు ఎదుర్కొని 24 రన్స్ చేశాడు. మంచి స్టార్ట్ దొరికినా దాన్ని భారీ స్కోరుగా మలచడంలో ఫెయిలయ్యాడు. రెండో ఇన్నింగ్స్​లోనైతే 8 బంతుల్లో 2 పరుగులు చేసి పెవిలియన్​కు చేరాడు. శార్దూల్​తో పాటు యంగ్ పేసర్ ప్రసిద్ధ్​ కృష్ణ కూడా భారీగా పరుగులు ఇవ్వడం, మహ్మద్ సిరాజ్ వికెట్లు తీసినా రన్స్​ను కంట్రోల్ చేయలేకపోవడంతో జస్​ప్రీత్ బుమ్రా ఒక్కడే అయిపోయాడు. అటు బ్యాటింగ్​లో విరాట్ కోహ్లీ, ఇటు బౌలింగ్​లో బుమ్రా ఒంటరి పోరాడటం చేశారు. అయినా టీమ్​ను ఓటమి బారి నుంచి గట్టెక్కించలేకపోయారు.

ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్​లోనూ శార్దూల్ ఠాకూర్ అంతగా ప్రభావం చూపలేదు. స్టార్టింగ్​లో అతడ్ని ఒకట్రెండు మ్యాచుల్లో ఆడించారు. అయినా లాభం లేకపోవడంతో అతడి ప్లేస్​లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీని తీసుకొచ్చారు. అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఉపయోగించుకున్న షమి అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. మెగాటోర్నీలో 8 మ్యాచుల్లో 23 వికెట్లు తీసి బెస్ట్ బౌలర్​గా నిలిచాడు. శార్దూల్ మాత్రం టీమ్ మేనేజ్​మెంట్ వరుస ఛాన్సులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నా దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం లేదు. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్​లోనూ బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​లో ఫెయిలయ్యాడు. దీంతో శార్దూల్​ను టీమ్​లో నుంచి తీసేసి.. అతడి స్థానంలో ముఖేష్ కుమార్, అర్ష్​దీప్ సింగ్ లాంటి యంగ్​స్టర్స్​కు అవకాశం ఇవ్వాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి.. శార్దూల్​ను తీసేయాలనే వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs SA: గెలుపు జోష్​లో ఉన్న సౌతాఫ్రికాకు ఊహించని షాక్.. ఇక, భారత్​కు పండగే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి