iDreamPost

IND vs ENG: ఇంగ్లండ్​కు భారత బ్యాటింగ్ కోచ్ వార్నింగ్.. తాడోపేడో తేల్చుకుందామంటూ..!

  • Published Feb 01, 2024 | 12:57 PMUpdated Feb 01, 2024 | 12:57 PM

ఇంగ్లండ్​తో రెండో టెస్టుకు ముందు భారత బ్యాటింగ్ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్​లో తాడోపేడో తేల్చుకుందామన్నాడు.

ఇంగ్లండ్​తో రెండో టెస్టుకు ముందు భారత బ్యాటింగ్ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్​లో తాడోపేడో తేల్చుకుందామన్నాడు.

  • Published Feb 01, 2024 | 12:57 PMUpdated Feb 01, 2024 | 12:57 PM
IND vs ENG: ఇంగ్లండ్​కు భారత బ్యాటింగ్ కోచ్ వార్నింగ్.. తాడోపేడో తేల్చుకుందామంటూ..!

ఇంగ్లండ్​తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ నెగ్గడం భారత్​కు ఎంతో కీలకంగా మారింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్స్​కు చేరుకోవాలంటే ఈ సిరీస్​ను కైవసం చేసుకోవడం ముఖ్యం. అందుకోసమే కాదు.. బజ్​బాల్​ క్రికెట్​ను చిత్తు చేయగలమని ప్రూవ్ చేసుకోవడానికి కూడా సిరీస్​లోని మిగతా మ్యాచుల్లో నెగ్గడం రోహిత్ సేనకు కంపల్సరీగా మారింది. సిరీస్ స్టార్ట్ అవడానికి ముందు వరకు ఇంగ్లీష్ టీమ్​ను ఓడించడం ఈజీ అని అంతా అనుకున్నారు. కానీ ఉప్పల్ టెస్టులో స్టోక్స్ సేన ఆడిన తీరు, భారత్ నుంచి మ్యాచ్​ను లాగేసుకోవడం, అటాకింగ్​ గేమ్​తో విజయం సాధించడం చూసి అందరూ షాకయ్యారు. దీంతో ఈ సిరీస్​ నెగ్గడం భారత్​కు ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఇంగ్లండ్​కు వార్నింగ్ ఇచ్చాడు. విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తున్న రెండో​ టెస్టులో తాడేపేడో తేల్చుకుందామన్నాడు.

తొలి టెస్టులో ఓడినా తమ గేమ్ స్టైల్ మార్చబోమని విక్రమ్ రాథోడ్ తెలిపాడు. బ్యాటింగ్​లో సేమ్ అప్రోచ్​తో ముందుకెళ్తామని అన్నాడు. ఇంగ్లండ్​ బజ్​బాల్​ ఫార్ములాకు తమదైన శైలిలో ఆడుతూ దెబ్బ కొడతామన్నాడు. అటాకింగ్ క్రికెట్​కు ఇంటెన్స్​తో ఆడటానికి చాలా తేడా ఉందన్నాడు. ‘అటాకింగ్ చేయడానికి ఇంటెన్స్​తో ఆడేందుకు డిఫరెన్స్ ఉంది. మా జట్టు ప్లేయర్లు మంచి ఇంటెన్స్​తో బ్యాటింగ్ చేయడాలని కోరుకుంటున్నా. మ్యాచులో ఎప్పుడు స్కోర్ చేయడానికి అవకాశం దొరికినా వాళ్లు దాన్ని పూర్తిగా యూజ్ చేసుకోవాలి. మేం మా శైలిలోనే ఆడతాం. టీమ్​లో కొందరు యంగ్​స్టర్స్​ ఉన్నారు. వాళ్లకు టెస్టు క్రికెట్​లో అంతగా అనుభవం లేదు. శుబ్​మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ విషయంలో ఇంకాస్త ఓపిక పట్టాలి. వాళ్ల బ్యాట్ నుంచి క్రమంగా పరుగులు వస్తాయి’ అని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు.

ఇంజ్యురీ కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో ఎవర్ని తీసుకుంటారనే దాని మీద విక్రమ్ రాథోడ్ రియాక్ట్ అయ్యాడు. రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ రూపంలో ఇద్దరు సూపర్ బ్యాటర్స్ అందుబాటులో ఉన్నారని.. వీళ్లలో ఒకర్ని తీసుకోవడం చాలా కష్టమన్నాడు. అయితే ఈ విషయంలో కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్ డిసిషన్ తీసుకుంటారని చెప్పాడు. పిచ్​ను బట్టి ఫైనల్ ఎలెవన్​ సెలక్షన్ ఉంటుందని తెలిపాడు. వైజాగ్ పిచ్​ స్పిన్​కు అనుకూలిస్తుందని.. కానీ తొలి రోజు నుంచే బాల్ టర్న్ కాకపోవచ్చన్నాడు. అయితే మంచి క్రికెట్ ఆడాలని, రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచించొద్దని ఆటగాళ్లకు చెప్పామన్నారు విక్రమ్ రాథోడ్. స్వీప్ షాట్ లాంటివి బాగా ప్రాక్టీస్ చేయాలని.. ఇలాంటి వాటి వల్ల బ్యాటర్లు కఠిన సమయాల్లోనూ పరుగులు చేయొచ్చన్నాడు. మరి.. ఇంగ్లండ్​కు భారత బ్యాటింగ్ కోచ్ వార్నింగ్ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి