iDreamPost

Team India: భారత్​తో సిరీస్​లో ఓటమి.. కుంటిసాకులు స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా!

  • Author singhj Published - 03:03 PM, Tue - 5 December 23

రీసెంట్​గా ముగిసిన టీ20 సిరీస్​లో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్​లో ఓటమికి కుంటిసాకులు వెతకడం మొదలుపెట్టింది కంగారూ టీమ్.

రీసెంట్​గా ముగిసిన టీ20 సిరీస్​లో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్​లో ఓటమికి కుంటిసాకులు వెతకడం మొదలుపెట్టింది కంగారూ టీమ్.

  • Author singhj Published - 03:03 PM, Tue - 5 December 23
Team India: భారత్​తో సిరీస్​లో ఓటమి.. కుంటిసాకులు స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా!

వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాలో చేతిలో ఓటమికి కొంత రివేంజ్ తీసుకుంది టీమిండియా. కంగారూలతో జరిగిన 5 టీ20ల సిరీస్​ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది భారత్. తద్వారా అభిమానులకు కాస్త ఊరట కలిగించింది. పోటాపోటీగా సాగిన ఈ సిరీస్​లో మన టీమ్ బాగా డామినేట్ చేసింది. స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్​వెల్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్, మార్కస్ స్టొయినిస్, టిమ్ డేవిడ్ లాంటి స్టార్ ప్లేయర్లతో ఈ సిరీస్​లో ఆడింది ఆసీస్. అటు భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ తప్ప అనుభవజ్ఞులు ఎవరూ లేరు. శ్రేయస్ అయ్యర్ ఆఖరి రెండు మ్యాచుల్లో బరిలోకి దిగాడు. స్టార్లు ఎవరూ టీమ్​లో లేకున్నా యంగ్​స్టర్స్​ అద్భుతంగా ఆడి గెలిపించారు.

యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, రింకూ సింగ్​లో బ్యాటింగ్​లో అదరగొట్టారు. ముకేశ్ కుమార్, అర్ష్​దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్​లు ఆకట్టుకున్నారు. అక్షర్, సూర్యలు తమ అనుభవంతో టీమ్​ గెలుపులో కీలక పాత్ర పోషించారు. మిస్టర్ 360 అటు బ్యాటింగ్​లో మెరవడంతో పాటు ఇటు బౌలింగ్​లోనూ తన మార్క్ చూపించాడు. వచ్చే ఏడాది జూన్​లో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్​లో విజయం, యువ ఆటగాళ్లు రాణించడం భారత్​కు బిగ్ ప్లస్ అనే చెప్పాలి. కంగారూ సిరీస్ ముగిసిపోవడంతో నెక్స్ట్ జరిగే సౌతాఫ్రికా టూర్​ఫై భారత్ ఫోకస్ పెడుతోంది.

సఫారీ టూర్​కు సంబంధించి ఆడబోయే టీమ్స్​ను ఇప్పటికే ప్రకటించింది బీసీసీఐ. ఆ సిరీస్​లో మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను ప్రకటించి ఆశ్చర్యపర్చింది. టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్టులకు రోహిత్ శర్మ ఆ సిరీస్​లో కెప్టెన్లుగా ఉండనున్నారు. సఫారీ టూర్​లో యంగ్​స్టర్స్​కు మరిన్ని ఛాన్సులు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని టీమ్ మేనేజ్​మెంట్ అనుకుంటోందట. ఒకవైపు భారత్ తన తర్వాతి సిరీస్​లతో బిజీ అయిపోతే మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం టీ20 సిరీస్ దగ్గరే ఆగిపోయింది. ఆ సిరీస్​లో ఓటమికి కుంటిసాకులు వెతుకుతోంది. తమ ప్లేయర్ల వైఫల్యాన్ని కారణంగా చూపకుండా.. అంపైరింగ్ తప్పిదాల వల్లే సిరీస్ కోల్పోయామని అంటోంది.

ఐదు టీ20ల సిరీస్​లో ఆఖరి మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్లింది. చివరి ఓవర్​లో ఆసీస్ గెలుపునకు 10 పరుగులు అవసరం అయ్యాయి. అయితే ఆ జట్టు కేవలం 3 రన్స్ మాత్రమే చేసి ఓటమిపాలైంది. వేడ్ లాంటి పించ్ హిట్టర్ కూడా ఫైనల్ ఓవర్ వేసిన అర్ష్​దీప్​ను ఎదుర్కోలేకపోయాడు. అతడి బౌలింగ్​లో రాంగ్ షాట్ ఆడి ఔటయ్యాడు. అయితే ఆ ఓవర్ ఫస్ట్ బాల్​ను అర్ష్​దీప్ బౌన్సర్​గా వేయగా.. వేడ్ పుల్ షాట్ ఆడబోయి ఫెయిలయ్యాడు. బాల్ బ్యాటర్​ కంటే ఎక్కువ ఎత్తులో వెళ్లినా అంపైర్ వైడ్ ఇవ్వలేదు. దీంతో షాకైన వేడ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని ప్రస్తావించాడు ఆసీస్ సీనియర్ ప్లేయర్ మ్యాథ్యూ హేడెన్. తమ టీమ్ ఓటమికి అంపైర్ వైడ్ ఇవ్వకపోడమే కారణమన్నాడు.

ఆ ఓవర్​లో ఆసీస్ బ్యాటర్ కొట్టిన మరో బాల్ అర్ష్​దీప్ చేతితో పాటు అంపైర్​ కాలికి తగిలి ఆగిపోయింది. అంపైర్​కు తగలకపోతే అది బౌండరీలోకి పోయేది. అందుకే ఈ బాల్​ గురించి స్పందిస్తూ.. అంపైర్ మరోమారు తన పాత్రను విజయవంతంగా పోషించాడని హేడెన్ విమర్శించాడు. అయితే అంపైర్ ఉద్దేశపూర్వకంగా అలా చేయకపోయినా హేడెన్ అతడ్ని టార్గెట్ చేయడం తప్పని నెటిజన్స్ అంటున్నారు. ఆడలేక మద్దెల దరువు అన్నట్లు ఓడిపోయి ఆ నెపాన్ని ఇంకొకరి మీద నెట్టడం ఏంటని సీరియస్ అవుతున్నారు. భారత్ విషయంలోనూ కొన్ని డెసిజన్స్ తప్పుగా ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. మరి.. అంపైర్ వల్లే ఓడామంటూ హేడెన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Virender Sehwag: సెహ్వాగ్ విధ్వంసక ఇన్నింగ్స్​కు 14 ఏళ్లు.. అలాంటి బ్యాటింగ్ నీకే సాధ్యం బాస్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి