iDreamPost

ముంబై-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి

  • Published Jul 31, 2023 | 10:32 AMUpdated Jul 31, 2023 | 10:32 AM
  • Published Jul 31, 2023 | 10:32 AMUpdated Jul 31, 2023 | 10:32 AM
ముంబై-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి

ఈమధ్య కాలంలో రైలు ప్రమాదాలు.. రైళ్లలో ప్రమాదకర సంఘటనలు చోటు చేసుకోవడం వంటివి తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. రైల్లో కాల్పుల కలకరం రేగింది. ఈ సంఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జైపూర్-ముంబై రైలులో సోమవారం ఉదయం ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో.. మహారాష్ట్రలోని పాల్ఘర్ సమీపంలో రైలులో ఒక్కసారిగా బుల్లెట్ల శబ్దం వినిపించింది. వాపి-బొరివలిమిరా రోడ్ స్టేషన్ మధ్య ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా, పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.

ఇక మరణించిన వారిలో ఓ ఏఎస్సై, ముగ్గురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్‌గా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాల్పులు చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి