Dharani
పైన ఉన్న ఫొటోని చూశారా.. వీరిలో ఉన్న ఓ మహిళ.. ప్రస్తుతం కేంద్రంలో చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు. ఇంతకు ఆమె ఎవరో గుర్తు పట్టారా...
పైన ఉన్న ఫొటోని చూశారా.. వీరిలో ఉన్న ఓ మహిళ.. ప్రస్తుతం కేంద్రంలో చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు. ఇంతకు ఆమె ఎవరో గుర్తు పట్టారా...
Dharani
చాలా కాలం నుంచి సోషల్ మీడియాలో థ్రో బ్యాక్ అదేనండి.. బాల్యంలో, యవ్వనంలో ఉన్నప్పటి ఫొటోలని షేర్ చేస్తూ.. రచ్చ చేస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు వారే స్వయంగా తమ ఫొటోలను షేర్ చేస్తుండగా.. కొందరు సెలబ్రిటీలకు సంబంధించి వారి ఫ్యాన్స్ తమ అభిమాన హీరో, హీరోయిన్లు, స్టార్స్, సెలబ్రీటలకు సంబంధించిన పాత ఫొటోలను వెతికి మరీ సోషల్ మీడియాలో షేర్ చేసి.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక కొందరు సెలబ్రిటీలు అయితే చిన్నప్పటికి.. ఇప్పటికి గుర్తు పట్టరాకుండా మారితే.. కొందరు మాత్రం.. వయసుతో సంబంధం లేకుండా.. చిన్నప్పుడు.. ఇప్పుడు ఒకేలా ఉన్నారు.
ఈ క్రమంలో తాజాగా నేడు ఓ పాత ఫొటో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీనిలో కొందరు యువతీయువకులు ఉన్నారు. అయితే వీరిలో ఉన్న ఓ మహిళ.. ఇప్పుడు కేంద్రంలో చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు. ఇంతకు ఆమె ఎవరో మీరు గుర్తు పట్టారా.. లేదా.. అయితే ఆమె ఎవరో తెలియాంటే.. ఇది చదవండి.
పైన ఫొటోలో ఉన్న వారిలో.. ఓ మహిళ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకు ఆమె ఎవరో మీరు గుర్తు పట్టారా.. లేదా అయితే మేమే చెబుతాం.. ఆమె ఎవరో కాదు.. ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆమె జేఎన్యూలో చదువుకుంటున్న సమయంలో స్నేహితులతో సరదాగా దిగిన ఫొటో ఇది. దీన్ని నిర్మలా సీతారామనే గత ఏడాది తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ పిక్లో తన పొడవు జడ, చీరకట్టుతో.. అచ్చ తెలుగు మహిళలా ఉన్నారు నిర్మలా సీతారామన్.
తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్.. తెలుగింటి కోడలు. తమిళనాడులోని మధురైలోని సావిత్రి, నారాయణన్ సీతారామన్ దంపతులకు 1959 ఆగస్టు 18న జన్మించారు. 1984లో ఢిల్లీ-జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో ఎమ్ఏ, ఎకనామిక్స్లో ఎంఫిల్ పూర్తి చేశారు. అయితే జేఎన్యూలో చదువుతున్న సమయంలో నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ మధ్య పరిచయం ఏర్పడింది. వీరు 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి వాంగ్మయి అనే కుమార్తె ఉంది. నిర్మల భర్త పరకాల ప్రభాకర్ కాంగ్రెస్ భావజాలం కలిగిన వ్యక్తి. పార్టీలు వేరైనా సరే వీరిద్దరిది ఎంతో అన్యోన్య దాంపత్యం.
2006లో బీజేపీలో చేరిన నిర్మలా సీతారామన్ అనతికాలంలోనే.. అంటే 2010లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పగ్గాలు చేపట్టారు. 2014 ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో అప్పుడు నరేంద్ర మోదీ కేబినెట్లో జూనియర్ మంత్రిగా నిర్మలా నియమితులయ్యారు. జూన్ 2014లో ఏపీ నుంచి, మే 2016లో కర్ణాటక స్థానం నుంచి పోటీ చేసి రాజ్యసభ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2017లో భారత రక్షణ మంత్రిగా ఆమె పనిచేశారు. ఇందిరాగాంధీ తర్వాత రక్షణ మంత్రిగా పదవిని చేపట్టిన రెండవ మహిళగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. అంతేకాకుండా పూర్తి కాలం ఆ పదవిలో కొనసాగిన మొదటి మహిళ కూడా నిర్మలా సీతారామనే కావడం విశేషం.
2019 ఎన్నికల తర్వాత నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికి ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. నేడు అనగా ఫిబ్రవరి 1, గురువారం ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్ సమర్పించనున్నారు.