iDreamPost

OTTలోకి ఒక్కరోజే 2 సస్పెన్స్ థ్రిల్లర్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Two Hit Movies Now Streaming In OTT: ఓటీటీ ఆడియన్స్ కి ఇది క్రేజీ వార్త అనే చెప్పాలి. ఎందుకంటే రెండు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఓకేసారి ఓటీటీలోకి వచ్చేశాయి. అవి కూడా మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి.

Two Hit Movies Now Streaming In OTT: ఓటీటీ ఆడియన్స్ కి ఇది క్రేజీ వార్త అనే చెప్పాలి. ఎందుకంటే రెండు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఓకేసారి ఓటీటీలోకి వచ్చేశాయి. అవి కూడా మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి.

OTTలోకి ఒక్కరోజే 2 సస్పెన్స్ థ్రిల్లర్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వీకెండ్ వస్తోంది అంటే.. ఓటీటీ ఆడియన్స్ అంతా అలర్ట్ అయిపోతారు. అలాగే మంచి ప్లానింగ్ కూడా చేస్తుంటారు. ఈ వీకెండ్ ఏ సినిమా చూడాలి? ఎలాంటి జానర్ సినిమాలను ఈ వీక్ చూద్దామని ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వారి కోసం ఓటీటీలోకి ఒక్కరోజు 2 క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ వచ్చేశాయి. అది కూడా తెలుగులోనే ఉండటం మరో విశేషం. ఈ వీకెండ్ విష్ లిస్ట్ లో మీరు కచ్చితంగా ఈ రెండు చిత్రాలను పెట్టుకోవాల్సిందే. మరి.. ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? అసలు ఆ మూవీస్ లో అంత స్పెషల్ ఏ ముందో చూద్దాం.

కరెక్ట్ కథ, కాన్సెప్ట్ తో వస్తే.. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే కాస్త లేట్ అయినా కూడా ప్రేక్షకులు ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ని చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక తెలుగు ఓటీటీలోకి ఒకేరోజు 2 థ్రిల్లర్ మూవీస్ వచ్చేశాయి. వాటిలో ఒకటి స్ట్రైట్ తెలుగు మూవీ. మరొకటి మాత్రం తెలుగులోకి డబ్ అయిన చిత్రం. ఆ తెలుగు స్ట్రైట్ మూవీ మరేదో కాదు.. వరుణ్ సందేశ్, శీతల్ భట్, కాశీ విశ్వనాథ్ లీడ్ రోల్స్ ప్లే చేసిన “చిత్రం చూడరా”. ఈ మూవీ ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ మూవీకి ఆర్ఎన్ హర్షవర్థన్ కథ, స్క్రీన్ ప్లే రాసి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీలో చాలానే స్టార్ కాస్ట్ ఉంది. ఇందులో తనికెళ్ల భరణి, రవిబాబు, శివాజీ రాజా, రాజా రవీంద్ర, మీనా కుమారి, అన్నపూర్ణ, రచ్చరవి లాంటి వాళ్లు కీలక పాత్రల్లో మెరిశారు.

ఈ చిత్రం చూడరా మూవీ కథ విషయానికి వస్తే.. సినిమాల్లోకి వెళ్లాలనే కోరికతో ఓ ముగ్గురు పల్లెటూరు నుంచి హైదరాబాద్ కు వస్తారు. వారికి సంబంధం లేని దొంగతనం కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత వారి జీవితాలు ఎన్ని మలుపులు తిరిగాయి అనేదే కథ. ఇంకో రెండో సినిమా విషయానికి వస్తే.. ఇది ఒక సైకో థ్రిల్లర్. తమిళ్ లో ఓమై సెన్నై అనే సినిమాని తెలుగులో పార్థు అనే టైటిల్ తో తీసుకొచ్చారు. ఇది 2021లో థియేటర్లలో విడుదలైన చిత్రం. ఈ మూవీ తమిళ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ అసిస్టెంట్ అర్జున్ ఏకలవ్యన్ తెరకెక్కించాడు. అప్పట్లో ఈ మూవీకి మంచి ఆజరణ లభించింది. ఇప్పుడు మూడేల్ల తర్వాత మే 9న తెలుగులో ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రెండు చిత్రాలు తెలుగు ఓటీటీ టీవీ విన్ యాప్ లో మే 9 నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి