iDreamPost

GHMC – బోణి కొట్టిన ఎంఐఎం

GHMC – బోణి కొట్టిన ఎంఐఎం

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల తొలి ఫలితం వెల్లడైంది. మోహిదీపట్నం డివిజన్‌లో ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. ఫలితాన్ని రిటర్న్‌ అధికారి ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాతే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది తెలుస్తుంది. ఈ డివిజన్‌లో 11,818 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. అన్ని డివిజన్ల కన్నా ఇక్కడ తక్కువ ఓట్లు పోలవడంతో ఈ డివిజన్‌ ఫలితం ముందుగా వస్తుందని అందరూ అంచనా వేశారు.

Also Read:తొలి కార్పొరేటర్ అక్కడ నుంచే.. !

ఈ డివిజన్‌లో ప్రధానంగా ఎంఐఎం, బీజేపీల మధ్య పోటీ నడిచింది. ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉన్న ఈ డివిజన్‌లో ఎంఐఎం తన పట్టును నిలుపుకుంది. గత ఎన్నికల్లోనూ మోహిదీపట్నంలో ఐంఎంఐ గెలిచింది. ఎంఐఎం పార్టీ తరపున మాజీ డిప్యూటీ మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ గెలుపొందారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి