iDreamPost

షాకింగ్ న్యూస్.. మ్యాచ్ లో పిడుగుపాటు గ్రౌండ్ లోనే చనిపోయిన ఆటగాడు!

క్రీడా ప్రపంచంలో మాటలకందని విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగానే పిడుగుపడటంతో.. ప్లేయర్ అక్కడికక్కడే మరణించాడు.

క్రీడా ప్రపంచంలో మాటలకందని విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగానే పిడుగుపడటంతో.. ప్లేయర్ అక్కడికక్కడే మరణించాడు.

షాకింగ్ న్యూస్.. మ్యాచ్ లో పిడుగుపాటు గ్రౌండ్ లోనే చనిపోయిన ఆటగాడు!

క్రీడా ప్రపంచంలో మాటలకందని విషాదం చోటుచేసుకుంది. సాధారణంగా మ్యాచ్ లు లేదా ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు క్రీడాకారులు గుండెపోటుతో మరణించిన వార్తలు మనం చాలానే విన్నాం. కానీ కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ ఫుట్ బాల్ మ్యాచ్ లో ఓ ఆటగాడు ఎవరూ ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన ఇండోనేషియాలోని ఓ ఫుట్ బాల్ మ్యాచ్ లో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ విషాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. నెటిజన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రపంచ ఫుట్ బాల్ ఆటలో తీవ్ర విషాదం నెలకొంది.  ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇండోనేషియాలో స్థానికంగా ఓ ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. అందులో ఓ ప్లేయర్ ఎవరూ ఊహించని విధంగా చనిపోయాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా అతడిపై పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే ఆ ఆటగాడు మరణించాడు. ఈ సంఘటన చూసిన సహచర ఆటగాళ్లు షాక్ కు గురైయ్యారు. వెంటనే అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్లేయర్ చనిపోయినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఈ విషాద సంఘటనతో మిగతా ఆటగాళ్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో.. వరల్డ్ వైడ్ గా ఉన్న క్రీడాభిమానులు విచారం వ్యక్తం చేస్తూ.. తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

ఇదికూడా చదవండి: Alzarri Joseph: వీడియో: క్లియర్‌ ఔట్‌ను నాటౌట్‌ ఇచ్చిన అంపైర్‌! రీజన్‌ తెలిస్తే షాకౌతారు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి