iDreamPost

తెనాలి లో వైఎస్సార్ సీపీ.. టీడీపీ బాహాబాహీ

తెనాలి లో వైఎస్సార్ సీపీ.. టీడీపీ బాహాబాహీ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఘర్షణతో తెనాలి పురపాలక కార్యాలయం వద్ద తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈరోజు ఉదయం నుండి మునిసిపల్ ఆఫీసు వద్ద భారీగా గుమికూడిన ఇరు పార్టీల కార్యకర్తలు మూడు రాజదానులకు అనుకూలంగా వైసిపి, వ్యతిరేకంగా టిడిపి శ్రేణులు పోటాపోటీ దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ దిష్టి బొమ్మని తెలుగుదేశం కార్యకర్తలు, చంద్రబాబు దిష్టి బొమ్మని వైసిపి కార్యకర్తలు దహనం చెయ్యడానికి ప్రయత్నించగా పోలీసులు వారిరువురికి అడ్డుకున్నారు.

Read Also: పథకాలు.. పేర్లు.. చంద్రబాబు బాటలో పయనిస్తున్న జగన్‌

ఈ సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎదురెదురుగా గుమికూడి ఒకరినొకరు రెచ్చగొట్టేలా పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో పాటు ఒక దశలో ఇరు పార్టీల కార్యకర్తలు రోడ్డు మీదే బాహాబాహీకి దిగారు. పోలీసులు అక్కడకి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే తెలుగుదేశం మద్దతిస్తున్న అమరావతి పరిరక్షణ జేఏసీ శిభిరంపై వైసిపి కార్యకర్తలు కోడిగుడ్లు, టమోటాలతో దాడులు చేశారని తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా సంఘటన స్థలానికి రావడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య మరోసారి తోపులాట జరిగింది. అదే సమయంలో అజ్ఞాత తెలియని వ్యక్తులు తెలుగుదేశం ఫ్లెక్సీలను చించివేసి తెలుగుదేశం దీక్షా శిబిరానికి నిప్పుపెట్టారు. అయితే ఘటన స్థలంలో ఉన్న వ్యక్తులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆపివేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి