iDreamPost
android-app
ios-app

Nimisha Sajayan: కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్న మలయాళీ భామ.. ఎంతవరకు నిజం !

  • Published Jun 10, 2024 | 10:35 AMUpdated Jun 10, 2024 | 10:35 AM

ఈ మధ్య కాలంలో నటి నటులంతా కూడా క్రమ క్రమంగా చేంజ్ అయిపోతూ ఉన్నారు. మొదట ప్రేక్షకులకు పరిచయం అయినపుడు ఒకలా ఆ తర్వాత మరోలా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో భామ యాడ్ అయిపోయింది.

ఈ మధ్య కాలంలో నటి నటులంతా కూడా క్రమ క్రమంగా చేంజ్ అయిపోతూ ఉన్నారు. మొదట ప్రేక్షకులకు పరిచయం అయినపుడు ఒకలా ఆ తర్వాత మరోలా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో భామ యాడ్ అయిపోయింది.

  • Published Jun 10, 2024 | 10:35 AMUpdated Jun 10, 2024 | 10:35 AM
Nimisha Sajayan: కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్న మలయాళీ భామ..  ఎంతవరకు నిజం !

నిమిషా సజయన్, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటు తెలుగు వారికి కూడా ఆమె పరిచయమే. ముంబై లో పుట్టి పెరిగినా కూడా ఆమె స్వతహాగా మాత్రం మలయాళీ అమ్మాయే. తనకున్న టాలెంట్ తో ఈ అమ్మడు. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోనూ నటిస్తుంది. 2017లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా ఈమె ఎవరో తెలియాలంటే రీసెంట్ గా నాయట్టు సినిమాలో కూడా ఈ భామ నటించింది. అయితే ఈ మధ్య కాలంలో నటి నటులంతా కూడా క్రమ క్రమంగా చేంజ్ అయిపోతూ ఉన్నారు. మొదట ప్రేక్షకులకు పరిచయం అయినపుడు ఒకలా ఆ తర్వాత మరోలా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో భామ యాడ్ అయిపోయింది.

తాజాగా నిమిషా సజయన్ కాస్మటిక్ సర్జరీ చేయించుకుందని ప్రచారం జరుగుతుంది. కెరీర్ స్టార్టింగ్ లో ఆమె ముఖం ఉన్న తీరు ఇప్పుడు ఆమె కనిపిస్తున్న తీరు పూర్తిగా మారిపోయిందని టాక్ నడుస్తుంది. ఇక దీనిపై కాస్మోటాలాజిస్ట్ ల అభిప్రాయాలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల డాక్టర్ శిఖ.. తానూ కాస్మొటిక్ సర్జరీలు చేయించుకోలేదని .. అలాగే నిమిష ముఖంలో వచ్చిన మార్పుకు గల కారణాన్ని కూడా పంచుకున్నారు. “నిమిష మునుపటి కంటే ఇప్పుడు బరువు తగ్గింది. రింగులుగా ఉన్న ఆమె హెయిర్ స్ట్రెయిట్ చేసింది. ఆమె పెదవిలోను ఎలాంటి మార్పు లేదు. ఆమె ముఖంలోను ఎలాంటి మార్పు లేదు” అంటూ శిఖ చెప్పుకొచ్చారు.

దీనితో చాలా మంది ఆమె సహజ సిద్దమైన అందానికి ఫిదా అయిపోయారు. ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఆమెను పొగడ్తల వర్షంతో ముంచేస్తున్నారు. ఇక ఇదంతా ఓ వైపైతే.. మరో వైపు ఆమెపై సోషల్ మీడియాలో సైబర్ అట్టాక్ జరుగుతుంది. మలయాళీ ప్రముఖ నటుడు సురేష్ గోపి త్రిసూర్ ఎన్నికల్లో గెలవలేరని ఆమె కామెంట్ చేసింది. కానీ ఇప్పుడు గోపి విజయం సాధించారు. దీనితో ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు కొంతమంది. సో ఆమె సోషల్ మీడియా కామెంట్స్ ను ఆఫ్ చేసింది. ఏదేమైనా ఇలాంటి ట్రోలింగ్స్ అనేవి సోషల్ మీడియాలో జరగడం ఈ మధ్య కామన్ అయిపొయింది, మరి నిమిషా సజయన్ పై వస్తున్న ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి