iDreamPost

“బేబీ” చిత్రంపై సీపీ ఆనంద్ సీరియస్.. స్పందించిన డైరెక్టర్!

“బేబీ” చిత్రంపై సీపీ ఆనంద్ సీరియస్.. స్పందించిన డైరెక్టర్!

హైదరాబాద్ లోని మాదాపూర్ లో పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో కొందరు నైజీరియన్లతో పాటు మరి కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే వీరి వద్ద దొరికిన కొకైన్ ను సైతం స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసుపై హైదరాబాద్ సీపీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ మూవీ చిత్రంపై సీరియస్ అయ్యారు. బేబీ సినిమాలో డ్రగ్స్ ను ప్రోత్సహించేలా చాలా రకాల సన్నివేశాలు ఉన్నాయని ఆయన ఫైర్ అయ్యారు. తాజాగా చేసిన రైడ్ తరహాలోనే ఆ మూవీలో చిత్రంలో కొన్ని సీన్లు ఉన్నాయని ద్వజమెత్తారు. ఇంతే కాకుండా ఈ మూవీ యూనిట్ సభ్యులకు నోటీసులు కూడా జారీ చేశారు సీపీ ఆనంద్. ఇప్పటి నుంచి అన్ని సినిమాలపై కూడా నిఘా ఉంచుతామని కూడా ఆయన హెచ్చరించారు.

ఈ క్రమంలోనే బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ తాజాగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే?.. సీపీ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. బేబీ మూవీలో డ్రగ్స్ వాడకాన్ని పోత్సహించలేదు, యువత డ్రగ్స్ బారిన పడితే ఎలాంటి పరిస్థితులు వస్తాయో మెసేజ్ మాత్రమే ఇచ్చామని సాయి రాజేష్ క్లారిటీ ఇచ్చారు. ఇక యువత బాధ్యతగా ఉండాలనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఆయన స్పష్టం చేశారు. నా తోటి దర్శకులు ఎవరూ కూడా డ్రగ్స్ సీన్స్ తీయొద్దని సాయి రాజేష్ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇవే వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో కాస్త వైరల్ గా మారుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి