iDreamPost

మెున్ననే మూవీ రిలీజ్.. డ్రగ్స్ రిహాబిటేషన్ సెంటర్ లో స్టార్ డైరెక్టర్?

  • Author Soma Sekhar Published - 05:53 PM, Tue - 27 June 23
  • Author Soma Sekhar Published - 05:53 PM, Tue - 27 June 23
మెున్ననే మూవీ రిలీజ్.. డ్రగ్స్ రిహాబిటేషన్ సెంటర్ లో స్టార్ డైరెక్టర్?

టాలీవుడ్ ను డ్రగ్స్ కేసు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ తో ఇండస్ట్రీ మెుత్తం ఒక్కసారిగా షేక్ అయ్యింది. పలువురు నటీ, నటుల పేర్లు కూడా వినిపించిన విషయం విదితమే. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ డ్రగ్స్ రిహాబిటేషన్ సెంటర్ లో ఉన్నట్లు న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడీ విషయా కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మరి ఆ డైరెక్టర్ ఎవరు? అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నిర్మించిన ‘టీకూ వెడ్స్ షేరు’ కొన్ని రోజుల క్రితమే నేరుగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాకు సాయి కబీర్ దర్శకత్వం వహించాడు. అయితే కొన్ని రోజుల క్రితం జరిగిన చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యేదాక అతడు ఎక్కడా కనిపించలేదు. అదీకాక మూవీని ప్రమోట్ చేస్తూ.. ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది లేదు. దాంతో డైరెక్టర్ ఏమై పోయాడు అంటూ ఆరా తీయ్యడం మెుదలెట్టారు.

ఈ క్రమంలోనే ఓ న్యూస్ తెలిసింది. సాయి కబీర్ గతంలో డ్రగ్స్ వాడకం వల్ల.. దానికి బాగా అడిక్ట్ అయ్యాడని, దాన్నుంచి బయటపడేందుకే ప్రస్తుతం రిహాబిటేషన్ సెంటర్ లో చేరినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. కాగా.. 15 ఏళ్లుగా సాయి కబీర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నాడు. తొలుత రైటర్ గా చేసి.. 2014లో కంగనా రనౌత్ ను ప్రధాన పాత్రలో పెట్టి తీసిన రివాల్వర్ రాణి చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి కబీర్. అయితే 2018లో కూడా ఇలానే రిహాబిటేషన్ సెంటర్ లో చేరాడు కబీర్.. ఇప్పుడు మరోసారి ఇలా ఆ సెంటర్ లో చేరడం చర్చనీయాంశమైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి