iDreamPost

సినిమా బాలేక పోతే బాలయ్య ఫ్యాన్స్‌ ఎందుకు ఫోన్‌ చేస్తారు: బోయపాటి

ఈ సినిమా ఫలితంపై దర్శకుడు బోయపాటి శీను తాజాగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ. ‘‘ అందరి కంటే ఎక్కువగా.. బాలకృష్ణ ఫ్యాన్స్‌నుంచి రివ్యూలు, అభిప్రాయాలను ఎక్కువగా నమ్ముతాను.

ఈ సినిమా ఫలితంపై దర్శకుడు బోయపాటి శీను తాజాగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ. ‘‘ అందరి కంటే ఎక్కువగా.. బాలకృష్ణ ఫ్యాన్స్‌నుంచి రివ్యూలు, అభిప్రాయాలను ఎక్కువగా నమ్ముతాను.

సినిమా బాలేక పోతే బాలయ్య ఫ్యాన్స్‌ ఎందుకు ఫోన్‌ చేస్తారు: బోయపాటి

బోయపాటి శీను- రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో ‘స్కంధ’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2023 సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. సినిమా బాగా లేదంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఈ సినిమా ఫలితంపై దర్శకుడు బోయపాటి శీను తాజాగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ. ‘‘ అందరి కంటే ఎక్కువగా.. బాలకృష్ణ ఫ్యాన్స్‌నుంచి రివ్యూలు, అభిప్రాయాలను ఎక్కువగా నమ్ముతాను.

స్కంధ బాగోలేకపోతే.. ఎందుకు బాలయ్య ఫ్యాన్స్‌ నాకు ఫోన్‌ చేస్తారు. ఉదయం సినిమా షో అయిపోయిన వెంటనే.. బాలయ్య ఫ్యాన్స్‌ నాకు ఫోన్‌ చేశారు. సినిమా అత్యాద్భుతంగా ఉందని నాకు చెప్పారు’’ అని అన్నారు. కాగా, బోయపాటి శీను స్కంధ కంటే ముందు బాలయ్య బాబుతో  ‘ అఖండ’ సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డులను కొల్లగొట్టింది. బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. వీరిద్దరూ కలిసి తీసిన మూడు సినిమాలు కూడా సూపర్‌ హిట్‌ అయ్యాయి.

‘ సింహ, లెజెండ్‌’ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక, బాలయ్య- బోయపాటి కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆఖండకు సీక్వెల్‌ కూడా తెరకెక్కే అవకాశం కూడా ఉంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న నాలుగో సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్‌ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కూడా అఖండ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నారు. మరి, స్కంధ సినిమా ఫలితంపై బోయపాటి స్పందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి