Idream media
Idream media
దేశ రాజధాని ఢిల్లీలో పార్టీల భవితవ్వాన్ని ఓటర్లు ఈ రోజు శనివారం నిర్ణయించనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు జరుగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 70 అసెంబ్లీ స్థానాల్లో 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1.47 కోట్ల మంది ఓటర్లు ఈ నేతల భవిష్యత్ను నిర్థేశించనున్నారు.
గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న 7 స్థానాలను బీజేపీ గెలుచుకోగా.. ఈ సారి అసెంబ్లీలో కూడా పాగా వేయాలని ఆశిస్తోంది. అయితే సంక్షేమ పథకాలతో ఢిల్లీలోని పేద, మధ్య తరగతి ప్రజల మనస్సులను చూరగొన్న ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తాననే ధీమాతో ఉంది. త్రిముఖ పోటీలో మూడో పార్టీగా ఉన్న కాంగ్రెస్కు అభ్యర్థులు దొరకడం కూడా కష్టమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ, ఆప్ ల మధ్యే ప్రధానంగా పోటీ జరగనుంది. ఈ నెల 11 న ఓట్ల లెక్కింపు చేపడతారు.