iDreamPost

సంచలన నిర్ణయం! కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని.. కుర్రాడి చేతికి పగ్గాలు

  • Published Mar 21, 2024 | 4:18 PMUpdated Mar 21, 2024 | 5:00 PM

ఐపీఎల్-2024కు ఒక్క రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతడి అందర్నీ డిసిషన్ షాక్​కు గురిచేస్తోంది.

ఐపీఎల్-2024కు ఒక్క రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతడి అందర్నీ డిసిషన్ షాక్​కు గురిచేస్తోంది.

  • Published Mar 21, 2024 | 4:18 PMUpdated Mar 21, 2024 | 5:00 PM
సంచలన నిర్ణయం! కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని.. కుర్రాడి చేతికి పగ్గాలు

ఐపీఎల్-2024 ఆరంభానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. శుక్రవారం నుంచి క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్ ఆరంభం కానుంది. ఫస్ట్ మ్యాచ్​లో పోటీపడుతున్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాక్టీస్​లో మునిగిపోయాయి. హోమ్ గ్రౌండ్​లో వేలాది మంది అభిమానుల నడుమ ఆర్సీబీని ఓడించి సీజన్​ను తమదైన స్టైల్​లో స్టార్ట్ చేయాలని సీఎస్​కే భావిస్తోంది. 16 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఐపీఎల్ కప్పును ఎలాగైనా కొట్టాలని కసి మీద ఉన్న ఆర్సీబీ.. తొలి మ్యాచ్​లో చెన్నైని ఓడిస్తే అదిరిపోతుందని అనుకుంటోంది. ఈ తరుణంలో సీజన్ ఆరంభానికి ఒక్క రోజు ముందు సీఎస్​కే కెప్టెన్ ఎంఎస్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. తన ప్లేసులో ఓ కుర్రాడికి కెప్టెన్సీ ఇచ్చేశాడు మాహీ.

కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన ధోని.. యంగ్ బ్యాటర్ రుతురాజ్​ గైక్వాడ్​కు పగ్గాలు అప్పజెప్పాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్​లో ఓ పోస్ట్ పెట్టింది. సారథ్య బాధ్యతల్ని రుతురాజ్​కు ధోని అప్పగించాడని తెలిపింది. అయితే సీఎస్​కే అనౌన్స్​మెంట్​కు ముందే ఈ విషయం బయటకు వచ్చింది. ఐపీఎల్ సీజన్​ రేపే స్టార్ట్ కానుండటంతో అన్ని జట్ల కెప్టెన్లతో కలసి గురువారం ఓ ఫొటో షూట్ నిర్వహించారు. ఇందులో అన్ని టీమ్స్ తరఫున ఆయా కెప్టెన్స్ హాజరయ్యారు. అయితే సీఎస్​కే తరఫున ధోనీకి బదులు రుతురాజ్ వచ్చాడు. దీంతో చాలా మందికి అక్కడే అనుమానం వచ్చింది. అయితే ఏదైనా కారణం వల్ల మాహీ రాలేక అతడ్ని పంపాడని అంతా అనుకున్నారు. కానీ సీఎస్​కే అధికారికంగా ప్రకటించడంతో రుతురాజ్ కొత్త కెప్టెన్ అనేది క్లారిటీ వచ్చేసింది. మరి.. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొని రుతురాజ్​కు ఆ బాధ్యతలు అప్పజెప్పడం మీద మీ ఒపీనియన్​ను కామెంట చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి