iDreamPost

ప్రభాస్ 20కి క్రేజీ టైటిల్స్

ప్రభాస్ 20కి క్రేజీ  టైటిల్స్

బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాగా ఇప్పటికే విపరీతమైన అంచనాలు మోస్తున్న జి. రాధాకృష్ణ దర్శకత్వంలోని ప్రాజెక్ట్ కు టైటిల్ ఆల్మోస్ట్ ఓకే అయినట్టుగా టాక్. విశ్వసనీయ సమాచారం మేరకు ఫిలిం ఛాంబర్ లో యువి క్రియేషన్స్ సంస్థ ఓ డియర్, రాధే శ్యాం అనే రెండు టైటిల్స్ రిజిస్టర్ చేసింది. ఇందులో ఏదో ఒకటి ఫిక్స్ చేయడం ఖాయమని అర్థమైపోయింది. కాకపోతే ఏది డిసైడ్ చేస్తారో ఇప్పటికైతే చెప్పలేం. గోపీచంద్ తో జిల్ చేసిన రాధాకృష్ణ దీని కోసమే నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశాడు.

సాహో తరహాలోనే 200 కోట్లకు పైగా బడ్జెట్ ఇదీ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతోందని సమాచారం. కాకపోతే యాక్షన్ జానర్ లో కాకుండా మంచి లవ్ స్టొరీని ఎంచుకున్నట్టుగా తెలిసింది. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో స్వాతంత్రం రాకముందు జరిగిన ప్రేమ కథగా దీన్ని డిఫరెంట్ యాంగిల్ లో చెప్పబోతున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ మీద ఎలాంటి అప్ డేట్ లేదు.

వచ్చే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ లాక్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆ సీజన్ లో అయితే ప్రభాస్ మూవీ రాదు. లేదూ షూటింగ్ త్వరగా పూర్తయ్యిందంటే ఈ దసరాకు వచ్చే ఛాన్స్ ఉంది. యువి సంస్థ దీని గురించి ఇప్పట్లో చెప్పే అవకాశం అయితే లేదు. గతంలో సాహో విషయంలో ఇలాగే మాట ఇస్తూ తప్పాల్సి వచ్చింది కాబట్టి అన్ని పూర్తయ్యాకే పోస్ట్ ప్రొడక్షన్ కన్నా ముందు మాత్రమే విడుదల తెదే ప్రకటించే అవకాశం ఉంది. బాహుబలి సాహోల కోసం ఆరేళ్ళకు పైగా టైం ఖర్చు పెట్టిన ప్రభాస్ దీన్నైనా తక్కువ టైంలో ఫినిష్ చేసి అభిమానులకు కానుక ఇస్తాడనుకుంటే అదీ జరిగే పనిలా లేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి