iDreamPost

అలా చేసుంటే ఇండియా వరల్డ్‌ కప్‌ గెలిచేది! CM మమతా బెనర్జీ కొత్త వాదన

  • Author singhj Published - 01:14 PM, Fri - 24 November 23

ప్రపంచ కప్ ఫైనల్​లో భారత టీమ్ గనుక అలా చేసుంటే కప్పు గెలిచేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. అసలు ఆమె తీసుకొస్తున్న కొత్త వాదన ఏంటో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచ కప్ ఫైనల్​లో భారత టీమ్ గనుక అలా చేసుంటే కప్పు గెలిచేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. అసలు ఆమె తీసుకొస్తున్న కొత్త వాదన ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Author singhj Published - 01:14 PM, Fri - 24 November 23
అలా చేసుంటే ఇండియా వరల్డ్‌ కప్‌ గెలిచేది! CM మమతా బెనర్జీ కొత్త వాదన

వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్​ ఓటమి చేసిన గాయాన్ని టీమిండియా ప్లేయర్స్, ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. కప్పు కొట్టాలన్న భారత ఆశలపై నీళ్లు చల్లిన ఆసీస్.. మన జట్టు అభిమానులకు సంతోషాన్ని దూరం చేసింది. ఆ ఓటమి బాధ నుంచి కోలుకునే లోపే టీమిండియా మరో సిరీస్​ను మొదలుపెట్టేసింది. వచ్చే ఏడాది జూన్​లో టీ20 వరల్డ్ కప్ ఉండటంతో ఇప్పటి నుంచే దానికి ప్రిపరేషన్స్​ను స్టార్ట్ చేసేసింది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్​ను ప్లాన్ చేసింది. ఈ రెండు టీమ్స్ మధ్య వైజాగ్ వేదికగా గురువారం ఫస్ట్ మ్యాచ్ నిర్వహించారు. ఇందులో భారత్ నెగ్గడంతో ఫ్యాన్స్ కాస్త శాంతించారు. కాగా, మెగా టోర్నీ ఫైనల్లో ఆసీస్ చేతిలో రోహిత్ సేన ఓటమిపై కొందరు ప్రముఖ పొలిటీషన్స్ రియాక్డ్ అవుతున్నారు. ఈ విషయంలోకి కేంద్రంలోని అధికార బీజేపీని లాగుతున్నారు.

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్​కు ముందు టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ టైమ్​లో వేసుకునే జెర్సీలపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. భారత ప్లేయర్లు వేసుకునే జెర్సీలు కాషాయ రంగులో ఉన్నాయని.. బీజేపీ ఇన్​ఫ్లుయెన్స్ వల్లే ఇలా జరిగిందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. దేశం మొత్తాన్ని బీజేపీ కాషాయమయం చేయాలని అనుకుంటోందని.. అందులో భాగంగానే టీమిండియా ప్లేయర్లతో ఆ జెర్సీలు వేయించారని విమర్శించారు దీదీ. అలాంటి ఆమె ఇప్పుడు మరో కొత్త వాదనకు తెరలేపారు. వరల్డ్ కప్ ఫైనల్​ను కోల్​కతా లేదా ముంబైలో నిర్వహిస్తే భారత టీమ్ గెలిచేదని మమత అన్నారు. ఈడెన్ గార్డెన్స్​ లేదా వాంఖడే స్టేడియంలో మ్యాచ్ పెడితే తప్పకుండా టీమిండియానే నెగ్గేదన్నారు. టీఎంసీ కార్యకర్తలను ఉద్దేశించి ఓ సభలో మాట్లాడుతూ ఆమె ఈ కామెంట్స్ చేశారు. అయితే మన ఆటగాళ్లను చూసి తాను గర్వపడుతున్నానని దీదీ చెప్పుకొచ్చారు.

మమతా బెనర్జీనే కాదు మరికొంత మంది పాపులర్ లీడర్స్ కూడా టీమిండియా ఓటమిపై కామెంట్స్ చేయడం గమనార్హం. రీసెంట్​గా రాజస్థాన్​లో జరిగిన ఎలక్షన్ ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వరల్డ్ కప్ ఫైనల్​లో టీమిండియా ఓటమిని ఆయన ప్రస్తావించారు. ఆ మ్యాచ్​లో మన జట్టే గెలిచేదని.. కానీ పనౌటి (ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి) టీమ్​ను ఓడిపోయేలా చేశారన్నారు. అయితే రాహుల్ కామెంట్స్​ మీద బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేగాక ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్​కు కూడా కంప్లయింట్ చేసింది. ఈ వివాదం మీద స్పందించిన ఎన్నికల సంఘం.. నవంబర్ 25వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.

మమతా బెనర్జీ, రాహుల్ గాంధీనే కాదు.. ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్​వాదీ పార్టీ చీఫ్​ అఖిలేష్​ యాదవ్ కూడా టీమిండియా ఓటమిపై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ గనుక గుజరాత్​లో కాకుండా యూపీలోని లక్నోలో జరిగే ఉంటే భారత జట్టుకు ఎంతో మంది ఆశీస్సులు లభించి ఉండేవన్నారు. ఇక్కడైతే రోహిత్ సేనకు విష్ణువు, అటల్ బిహారీ వాజ్​పేయి బ్లెస్సింగ్ దొరికేవని తెలిపారు. భారత టీమ్ ఓటమిని రాజకీయ నేతలు బీజేపీపై విమర్శలు చేసేందుకు వాడుతుండటంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటమిపై వివాదాలు రేపడం మాని.. టీమ్​కు సపోర్ట్​గా ఉండాలని అంటున్నారు. మరి.. టీమిండియా ఓటమిపై దీదీ సహా ఇతర నేతలు చేస్తున్న వాదనల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆస్పత్రి బెడ్​ మీద రషీద్ ఖాన్.. ఆఫ్ఘాన్ స్టార్​కు ఏమైంది?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి