iDreamPost

ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు

ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులను కేంద్రప్రభుత్వం నియమించింది. నూతన న్యాయమూర్తులుగా రావు రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య నియామకానికి శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరుకోనుంది. న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం గతేడాది జూలై 25న కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నలుగురు న్యాయమూర్తులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి సోమవారం ప్రమాణం చేయించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి