iDreamPost

వీడియో: Animal రెస్పాన్స్ చూసి కన్నీరు పెట్టుకున్న బాబీ డియోల్

డిసెంబర్ 1న పాన్ ఇండియా మూవీగా విడుదలైన యానిమల్.. రికార్డులు సృష్టిస్తోంది. మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా పట్ల వస్తున్న రెస్పాన్స్ చూసి ప్రముఖ నటుడు భావోద్వేగానికి గురయ్యారు.

డిసెంబర్ 1న పాన్ ఇండియా మూవీగా విడుదలైన యానిమల్.. రికార్డులు సృష్టిస్తోంది. మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా పట్ల వస్తున్న రెస్పాన్స్ చూసి ప్రముఖ నటుడు భావోద్వేగానికి గురయ్యారు.

వీడియో: Animal రెస్పాన్స్ చూసి కన్నీరు పెట్టుకున్న బాబీ డియోల్

బాక్సాఫీస్ వద్ద యానిమల్ మూవీ కాసుల వర్షం కురిపిస్తుంది. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ థియేటర్లను షేక్ చేసేస్తుంది. డిసెంబర్ 1న పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ మూవీ మూడు రోజుల్లోనే 300 కోట్ల రూపాయల మార్క్‌ను దాటేసింది. బీటౌన్‌లో సందీప్ పేరు మరింతగా మార్మోగిపోతోంది. యాక్షన్, ఫ్యామిలీ అండ్ బోల్డ్ కంటెంటె బాగా ఇష్టపడే బాలీవుడ్ ప్రేక్షకులు.. ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. ఇటు సౌత్ ఇండస్ట్రీ నుండి కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరి క్యారెక్టర్‌ను బాగా హ్యాండిల్ చేశాడు ఈ మూవీ కెప్టెన్ సందీప్. ఈ చిత్రాన్ని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియో సంయుక్తంగా నిర్మించింది.

ఈ మూవీలో హీరో హీరోయిన్లు తర్వాత అంటే ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించారు అనిల్ కపూర్, బాబీ డియోల్, బబ్లూ పృథ్వీరాజ్ వంటి సీనియర్ నటులు. ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్‌తో పాటు.. తన నటనకు మంచి మార్కులు పడటంతో ఆ ఆనందాన్ని తట్టుకోలేక.. అందరి ముందు కన్నీరు పెట్టుకున్నాడు బాబీ డియోల్. ముంబయిలో యానిమల్ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ ను సందర్శించిన బాబీ.. ఆడియన్స్ నుండి ఊహించని రీతిలో స్పందన రావడంతో ఎమోషనల్ అయ్యారు. అక్కడే కొందరి ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అందరూ చూస్తుండగానే కన్నీరు పెట్టుకున్నాడు. తన టీం సభ్యుల మధ్య కన్నీళ్లు తుడుచుకున్నాడు.

ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా ఆయనకు కన్నీరు ఆగడం లేదు. ఉబికి వస్తున్న ఆనందాన్ని కళ్ల నుండి నీళ్లుగా కారుతున్నాయి. వాటిని తుడుచుకుంటూనే అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తన సంతోషాన్ని మాటల్లో వ్యక్తం చేయలేక.. సైగలతో ధ్యాంక్స్ చెప్పారు. ఒకప్పుడు బాలీవుడ్ హీరోల్లో బాబీ డియోల్ అంటే ఓ రకమైన క్రేజ్ ఉండేది. అయితే ఆ తర్వాత కెరీర్ నెమ్మదించింది. ఇప్పుడు విలన్ పాత్రలతో మెప్పిస్తున్నారు. తర్వలో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే హరి హర వీర మల్లులో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరో మూవీ కోసం కూడా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Anjul Sirohi Deols (@anjulsirohi.deols)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి