iDreamPost

కూతురుకి పెళ్లి సంబంధాలు చూసిన తల్లిదండ్రులు! యువతి ఏం చేసిందో తెలుసా?

కూతురుకి పెళ్లి సంబంధాలు చూసిన తల్లిదండ్రులు! యువతి ఏం చేసిందో తెలుసా?

ఈ యువతిని ఆమె తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి డిగ్రీ వరకు చదివించారు. ఏదైన సాధించాలనే ఆశయంతో ఈ అమ్మాయి కూడా బాగానే చదివింది. ఇక డిగ్రీ అనంతరం ఉన్నత చదువులు చదవాలనుకున్నా తల్లిదండ్రుల వద్ద స్థోమత లేదు. దీంతో అప్పటి నుంచి పొలానికి వెళ్తూ పనిలో తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచింది. అయితే, కూతురుకి పెళ్లి వయసు రావడంతో ఆమె తల్లిదండ్రులు ఇటీవల పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. పెళ్లి ఇప్పుడు చేసుకోనంటూ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పింది. కానీ, వాళ్లు వినలేదు. దీంతో ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని పాత తడాలో గ్రామంలో భూక్య లింబా-లలిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి పావని (24) అనే కూతురు ఉంది. అయితే, ఈ యువతి డిగ్రీ వరకు చదువుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రుల వద్ద చదివించే స్థోమత లేకపోవడంతో అప్పటి నుంచి పొలానికి వెళ్తూ పనిలో తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచింది. ఈ క్రమంలోనే కూతురికి పెళ్లి వయసు రావడంతో తల్లిదండ్రులు పెళ్లి చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే గత కొన్ని రోజుల నుంచి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు.

కానీ, ఆ యువతికి మాత్రం ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కానీ, వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో చేసేదేం లేక ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి తల్లిదండ్రులు వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ ఆ యువతి శుక్రవారం ప్రాణాలు విడిచింది. అనంతరం మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: మిద్దెపై పడుకున్న భర్త.. లేపేందుకు వెళ్లిన భార్యకు షాక్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి