iDreamPost

ముగిసిన బీఏసీ సమావేశం.. అజెండా ఇదే..

ముగిసిన బీఏసీ సమావేశం.. అజెండా ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి సంబంధించిన అజెండా ఖరారుకు జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయించారు. సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లులను ఈ రోజు సమావేశంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

Read Also: సీఆర్డీఏ రద్దు.. ఎఎంఆర్డీఏ ఏర్పాటు..

సమయం ఉంటే అమ్మ ఒడి, ఇతర ప్రభుత్వ పథకాలపై చర్చించాలని నిర్ణయానికి వచ్చారు.

సీఆర్‌డీఏ రద్దు, ఏఏంఆర్‌డీఏ ఏర్పాటు, అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై చర్చ, ఆమోదం తర్వాత శాసన మండలికి పంపాలని నిర్ణయించారు. రేపు జరగబోయే శాసన మండలిలో ఈ రెండు బిల్లులపై చర్చించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి