iDreamPost

3 ఏళ్లుగా సహజీవనం.. ప్రియురాలిని ​కుక్కర్‌తో కొట్టి..

3 ఏళ్లుగా సహజీవనం.. ప్రియురాలిని ​కుక్కర్‌తో కొట్టి..

ఏ బంధం అయినా కావచ్చు.. ప్రేమతో పాటు నమ్మకం, స్వేచ్ఛ ఉన్నపుడే ఎక్కువ కాలం నిలుస్తాయి. ఈ రెండు లేకపోయినా.. ఎదుటి వ్యక్తి ఏం చేసినా మన్నించగలిగే.. ఎలాంటి షరతులు లేకుండా స్వీకరించగలిగే ప్రేమన్నా ఉండాలి. అలా కాకపోతే బంధం ఎక్కువ కాలం నిలవదు. మనుషుల ప్రవర్తన కారణంగా వారి మధ్య బంధాలు తెగి విడిపోతే పర్లేదు. అలా కాకుండా బంధానికి బదులు ప్రాణాలు పోతేనే దారుణంగా ఉంటుంది. ఏదైనా బంధంలోకి అనుమానం అనే పెనుభూతం దూరినపుడు ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉంటాయి.

ఒక్కసారి అనుమానం మొదలైతే పెరిగి పెద్దదవుతంది తప్ప.. అంత ఈజీగా చావదు. ఈ అనుమానం కారణంగా పోయిన ప్రాణాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా, ప్రియురాలి మీద అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను కుక్కర్‌తో కొట్టి చంపాడు. ఈ సంఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేరళకు చెందిన వైష్ణవ్‌, దేవి కాలేజీ చదువుకునే రోజు నుంచి ప్రేమికులు. కొన్నేళ్ల క్రితం ఇద్దరికీ బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగంవచ్చింది.

దీంతో బెంగళూరులో ఓ ప్లాట్‌ అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా కలిసి ఉంటున్నారు. వీరిద్దరూ తరచుగా గొడవలు పడుతూ ఉండేవారు.. మళ్లీ కలిసిపోయేవారు. అయితే, గత కొన్ని రోజుల నుంచి వైష్టవ్‌.. దేవిపై అనుమానంతో ఉన్నాడు. ఆమె తప్పు చేస్తోందని అతడు భావించాడు. ఈ నేపథ్యంలోనే 26వ తేదీ ఉదయం దేవితో గొడవ పెట్టుకున్నాడు. గొడవ చినికి చినికి గాలి వాన అయింది. ఈ నేపథ్యంలోనే వైష్ణవ్‌ కుక్కర్‌తో దేవిని కొట్టి చంపాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. పొరిగింటి వారు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి