iDreamPost

Balakrishna: బాలయ్య డ్రీమ్ ప్రాజెక్టు కోసం డైరెక్టర్ దొరికేశాడు..!

నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్టు కోసం డైరెక్టర్ దొరికేశాడని చెబుతున్నారు.

నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్టు కోసం డైరెక్టర్ దొరికేశాడని చెబుతున్నారు.

Balakrishna: బాలయ్య డ్రీమ్ ప్రాజెక్టు కోసం డైరెక్టర్ దొరికేశాడు..!

ఎంతటి స్టార్ హీరోకి అయినా తనకంటూ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. తనకి నచ్చిన ఒక కథలో తన డ్రీమ్ రోల్ తనని తాను చూసుకోవాలి అనుకుంటాడు. అలాంటి ఒక డ్రీమ్ నందమూరి బాలకృష్ణకు ఉంది అనే విషయం తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ‘ఆదిత్య 999’ అనే సినిమా బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ఆ కథ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే చాలాసార్లు ఆ కథను పట్టాలు ఎక్కించాలని, ఫలానా డైరెక్టర్ తో చేయాలి అని బాలకృష్ణ అనుకున్నాడు. కానీ, అది మాత్రం సెట్స్ మీదకు రాలేదు. కానీ, ఇప్పుడు ఆ కథ సెట్స్ మీదకు వచ్చే అవకశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ కు డైరెక్టర్ సెట్ అయినట్లే అని టాక్ వినిపిస్తోంది.

బాలకృష్ణకు ఆదిత్య 999 అనేది డ్రీమ్ ప్రాజెక్ట్. తన కెరీర్ లో వందో చిత్రంగా ఈ ఆదిత్య 999ను తెరకెక్కించాలి అనుకున్నాడు. ఒక సందర్భంలో సింగీతం శ్రీనివాసరావును డైరెక్టర్ గా అనుకున్నారు. ఆ తర్వాత తానే స్వయంగా డైరెక్షన్ బాధ్యతను కూడా తీసుకోవాలి అనుకున్నాడు. కానీ, అవేమీ వర్కౌట్ అవ్వలేదు. ఆ ప్రాజెక్ట్ అలాగే మిగిలిపోయింది. ఆ తర్వాత డైరెక్టర్లు కథలు తీసుకుని బాలయ్య వద్దకు క్యూ కట్టడంతో ఆ ప్రాజెక్టుల మీద దృష్టి సారించారు. ఆదిత్య 999 కథ ఇన్ని సంవత్సరాలు వాయిదా పడుతూ రావడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. అదేంటంటే ఆ కథను హ్యాండిల్ చేసే డైరెక్టర్ బాలయ్యకు తారస పడలేదు. అందుకే ఇన్ని సంవత్సరాలైనా ఆ కథను అలాగే ఉంచారు అని చెబుతున్నారు. ఆదిత్య 999 అనేది ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీ. అలాంటి కథను హ్యాండిల్ చేయాలి అంటే అటు డైరెక్షన్ మీద మాత్రమే కాకుడా.. విజువల్ సెన్స్, టెక్నాలజీ మీద పట్టు తప్పకుండా ఉండాలి.

ఇప్పుడు అలాంటి క్వాలిటీస్ కలిగిన ఒక డైరెక్టర్ బాలయ్య దృష్టిలో పడ్డాడు. అందుకే ఇప్పుడు బాలయ్య అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అతి త్వరలోనే బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. ప్రశాంత్ వర్మ. ఇప్పుడు బాలయ్యకు ప్రశాంత్ వర్మ రూపంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ మీద హోప్స్ వచ్చాయంటున్నారు. జాంబీరెడ్డి, హనుమాన్ సినిమాలతో ప్రశాంత్ వర్మ తన సత్తా ఏంటో ఇప్పటికే అందరికీ తెలిసేలా చేశాడు. అతి తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ అవుట్ పుట్ తీసుకురావడంలో ప్రశాంత్ వర్మ దిట్ట. పైగా ప్రశాంత్ వర్మకు కూడా బాలయ్య సినిమా తీయాలి అనే ఆలోచన ఉంది. అయితే తన సొంత కథతో బాల్యయను మెప్పించాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నాడు. ఇప్పటికే పలు దఫాలు బాలయ్యతో ప్రశాంత్ వర్మ భేటీ కూడా అయ్యాడు. అయితే బాలయ్య సన్నిహితులు మాత్రం ఆదిత్య 999 కథను ప్రశాంత్ వర్మతో తెరకెక్కిస్తే బాగుంటుందని సలహాలిస్తున్నారట.

మరోవైపు ప్రశాంత్ వర్మకు కూడా అలాంటి కథలంటే ఇంట్రస్ట్ ఎక్కువే కాబట్టి బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ను యాక్సెప్ట్ చేసేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒకవేళ ఒప్పుకున్నా కూడా అది సెట్స్ మీదకు వచ్చేందుకు కనీసం రెండేళ్ల సమయం అయితే పడుతుంది. ఎందుకంటే 2025లో జై హనుమాన్ తీసుకొస్తానని ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. దానికంటే ముందు మరో రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పాడు. కాబట్టి ఈ 3 చిత్రాలు పూర్తయిన తర్వాత మాత్రమే ప్రశాంత్ వర్మ- బాలయ్య కాంబో సెట్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఈ కాంబో సెట్ కావడం ఎంత వరకు సాధ్యం అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి.. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ని ప్రశాంత్ వర్మ టేకప్ చేస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి