iDreamPost

అసెంబ్లీ ప్రారంభం.. సభ ముందుకు రెండు బిల్లులు..

అసెంబ్లీ ప్రారంభం.. సభ ముందుకు రెండు బిల్లులు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం 11:10 గంటలకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం సభను ప్రారంభించారు. మొదట్లోనే ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లు –2020, సీఆర్‌డీఏ రద్దు బిల్లు – 2020 బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులను వరుసగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యానారయణలు ప్రవేశపెట్టారు.

Read Also: సీఆర్డీఏ రద్దు.. ఎఎంఆర్డీఏ ఏర్పాటు..

బిల్లులు ప్రవేశపెట్టిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లు –2020పై చర్చ ప్రారంభించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చర్చను ప్రారంభించారు. బిల్లు ప్రవేశపెట్టేందుకుగల కారణాలను వివరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి