iDreamPost

Anushka Shetty: అనుష్క కోసం క్రిష్ క్రేజీ టైటిల్.. అప్పటి సరోజాని మరిచేలా!

  • Published Feb 16, 2024 | 5:10 PMUpdated Feb 16, 2024 | 5:10 PM

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ అందరిలో అనుష్క అంటే అందరికి ప్రత్యేకమే. అనుష్క స్క్రీన్ పైన ఎపుడు కనిపిస్తుందా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం త్వరలోనే అనుష్క తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేయనుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ అందరిలో అనుష్క అంటే అందరికి ప్రత్యేకమే. అనుష్క స్క్రీన్ పైన ఎపుడు కనిపిస్తుందా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం త్వరలోనే అనుష్క తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేయనుంది.

  • Published Feb 16, 2024 | 5:10 PMUpdated Feb 16, 2024 | 5:10 PM
Anushka Shetty: అనుష్క కోసం క్రిష్ క్రేజీ టైటిల్.. అప్పటి సరోజాని మరిచేలా!

లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ అంటే అందరికి టక్కున గుర్తొచ్చేది అనుష్క. టాలీవుడ్ లో అనుష్కను అందరు స్వీటీ అని పిలుచుకుంటూ ఉంటారు. అరుంధతి, బాహుబలి చిత్రాలతో ఇండస్ట్రీలో తన స్టాండర్డ్ పెరిపోయింది. కేవలం తెరమీదే కాకుండా తెర వెనుక కూడా అనుష్కకు ఎంతో చక్కని పేరు ఉంది. ఇండస్ట్రీలో కానీ, బయట కానీ అనుష్క గురించి ఎవరిని అడిగినా అందరూ ఎంతో పాజిటివ్ గా చెప్తూ ఉంటారు. అయితే , ఇప్పవరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన స్వీటీ .. ఓ రకంగా బాహుబలి తర్వాత సినిమాలు తీయడం తగ్గించిందని చెప్పి తీరాలి. ఈ క్రమంలో అనుష్క వెండితెరపై ఆఖరిగా కనిపించిన చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. దీనితో అభిమానులంతా అనుష్క నెక్స్ట్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం త్వరలోనే స్వీటీ అందరికి తన నెక్స్ట్ మూవీతో గుడ్ న్యూస్ చెప్పనుంది.

ప్రస్తుతం అనుష్క.. డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ తీస్తుందని సమాచారం. గతంలో వేదం అనే చిత్రానికి అనుష్క క్రిష్ తో కలిసి వర్క్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో.. త్వరలో మరో సినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ఇటీవలే ఆంధ్రా- ఒడిశా బోర్డర్ లో ఈ మూవీ షూటింగ్ కూడా జరిగిందని అంటున్నారు. అక్కడ అనుష్కపై కీలక సన్నివేశాలు తీస్తున్నట్టు సమాచారం. అలాగే ఈ మూవీకి సంబంధించి మరో అప్ డేట్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ సినిమా కథ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోందట. తనకు జరిగిన ఓ అన్యాయంపై ఓ ఒడిశా అమ్మాయి చేసిన పోరాటమే.. ఈ మూవీ కథ అని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు “శీలావతి” అనే టైటిల్ ను కూడా పెట్టారని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని రామోజి ఫిలిం సిటీలో షూట్ చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారట. ఇక అనుష్క సినిమాల విషయానికొస్తే ఈ సినిమాతో పాటు.. మలయాళంలో ‘కథనార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే చిత్రంలో నటిస్తోందట. దీనితో ఆల్ టైమ్ అనుష్క ఫ్యాన్స్ అంత.. తన నెక్స్ట్ మూవీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అనుష్క , క్రిష్ కాంబినేషన్ లో రాబోయే మూవీ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి