iDreamPost

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి 13 మెట్రో స్టేషన్లు

  • Published Apr 28, 2024 | 11:30 AMUpdated Apr 28, 2024 | 11:30 AM

నగరంలో మెట్రో సేవలను వినియోగించుకునే ప్రయాణికులకు తాజగా మెట్రో ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న ఫేజ్ 2 కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక నగరవాసులకు ఇది ఒక మంచి బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు.

నగరంలో మెట్రో సేవలను వినియోగించుకునే ప్రయాణికులకు తాజగా మెట్రో ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న ఫేజ్ 2 కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక నగరవాసులకు ఇది ఒక మంచి బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు.

  • Published Apr 28, 2024 | 11:30 AMUpdated Apr 28, 2024 | 11:30 AM
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి 13 మెట్రో స్టేషన్లు

హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ ప్రయాణికులకు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు మెట్రో సదుపాయం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిత్యం ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులు చేసుకునే వారు మెట్రోలో ప్రయాణించడానికే మొగ్గు చూపుతున్నారు. ఇక ప్రయాణికులను ఆకర్షించేందుకు హైదరాబాద్ మెట్రో కూడా పలు రకాలైన ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. పైగా ప్రయాణికు ఎక్కడికైనా చాలా వేగంగా, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇక ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా గంటల సమయం ప్రయాణం పట్టేది. కానీ, ఇప్పుడు నిమిషాల వ్యవధిలో ఎంత దూరమైన ప్రయాణించడానికి సులువుగా ఈ మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా.. ఎండ, వాన వంటి భయాలేవీ లేకుండా.. చక్కగా ఏసీలో ప్రయాణించవచ్చు. అందుచేత నగరంలో ఎన్నిసదుపాయాలు ఉన్నా.. మెట్రోకు సాటి ఏదీ లేదంటూ ప్రతిఒక్కరు ఈ మెట్రో ప్రయాణానికి ఆసక్తి చూపుతారు.అయితే తాజాగా నగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నగరవాసులకు ఇది మంచి బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

నగరంలో మెట్రో సేవలను వినియోగించుకునే ప్రయాణికులకు తాజగా మెట్రో ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న ఫేజ్ 2 కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. కాగా, ఇందులో భాగంగానే శంషాబాద్ ఎయిర్ పోర్టు మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కి.మీ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. అలాగే ఈ ఫేజ్ 2లో 13 మెట్రో స్టేషన్లు ప్రయాణికులకు అందుదబాటులోకి రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇక ఈ మెట్రో స్టేషన్ అనేది నాగోల్ నుంచి ప్రారంభమై.. నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి, ఎల్బీనగర్ కూడలి, సాగర్ రింగ్ రోడ్డు, మైత్రీనగర్, కర్మన్ ఘాట్, చంపాపేట రోడ్ కూడలి, ఇవైసీ ఆసుపత్రి, డీఆర్ డీవో, హఫీజ్ బాబానగర్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కొత్త మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మెట్రో రైలు ఎలైన్ మెంట్, స్టేషన్ల ఏర్పాటుకు శనివారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. కాగా, మెట్రో రైలు స్టేషన్లకు సంబంధించి వాటి పేర్ల ఖరారుకు ట్రాఫిక్ పోలీసుల, సాధారణ ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని సూచనలు చేశారు. మరి, నగరవాసులకు అదనంగా మరో 13 మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన శుభవార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి