iDreamPost

OTT:అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి యానిమల్?

  • Published Jan 03, 2024 | 6:50 PMUpdated Mar 14, 2024 | 5:08 PM

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కథనాయకుడిగా తెరకెక్కించిన మూవీ యానిమల్. ఇక ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్లి రికార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రేక్షకులు ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్న యానిమల్ మూవీ త్వరలోనే ఓటీటీలో సందడి చేయబోతుంది. అది ఏప్పుడంటే..

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కథనాయకుడిగా తెరకెక్కించిన మూవీ యానిమల్. ఇక ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్లి రికార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రేక్షకులు ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్న యానిమల్ మూవీ త్వరలోనే ఓటీటీలో సందడి చేయబోతుంది. అది ఏప్పుడంటే..

  • Published Jan 03, 2024 | 6:50 PMUpdated Mar 14, 2024 | 5:08 PM
OTT:అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి యానిమల్?

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ , రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన వైల్డ్ యాక్షన్ మూవీ ‘యానిమల్’. ఈ యానిమల్ మూవీతో సందీప్ సంచలనం సృష్టించాడు. భారీ అంచనాల నడుమ దేశవ్యాప్తంగా డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్లి రికార్డులను కొల్లగొట్టింది. కాగా, అర్జున్ రెడ్డి  సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిన సందీప్ మరోసారి తన టాలెంట్ తో దుమ్ము దులిపేశాడు. ఇక ఈ సినిమాకు అటు తెలుగు తో పాటు హిందీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ మూవీలో రణబీర్ యాక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే థియేటర్ లను షేక్ చేసిన యానిమల్ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా యానిమల్ మూవీ ఓటీటీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ గా మారింది. అదే ఏమిటంటే..

గత ఏడాది ప్రేక్షకులను మెప్పించిన సినిమాల్లో యానిమల్ సినిమా ఒకటి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో కి వస్తుందా అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే యానిమల్ సినిమా ఇప్పటికి కూడా కొన్ని చోట్ల స్క్రీనింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా సంబంధించి ఓటీటీ రిలీజ్ పై చాలా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేమిటంటే.. ఈ యానిమల్ మూవీ రైట్స్ ను.. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.  అలాగే ఈ యానిమల్ సినిమాను జనవరి 15న సంక్రాంతి సందర్భంగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారనే టాక్ వైరల్ గా మారింది. అయితే త్వరలోనే ఈ మూవీ పై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఇక ఈ యానిమల్ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా తన అద్భుతమైన నటనతో మెప్పించారు. అలాగే అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా థియేటర్ లో విడుదలైనప్పుడు ప్రశంసలతో పాటు అనేక విమర్శలు కూడా గుప్పుమన్నాయి. కాగా, 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 887.69 కోట్లు కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్స్ లో సంచలనం సృష్టించిన యానిమల్ మూవీ ఓటీటీలో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి, సంక్రాంతి సందర్భంగా యానిమల్ మూవీ ఓటీటీలోకి రాబోతుందని వస్తున్న వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి